Telangana Indiramma Housing Scheme Guidelines
సర్వే సమయంలో స్థలం చూపిన చోటే నిర్మించాలి. ముగ్గు పోసుకున్నాక గ్రామ కార్యదర్శికి చెబితే ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు.
రైతు ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ఇచ్చిన ఆరు గారెంటీలపై పనిని వేగవంతం చేసింది ఆరు గారెంటీలలో ఒకటైన ఇందిరమ్మ హోసింగ్ షెమీకి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది రేవంత్ సర్కార్ సర్వే సమయంలో స్థలం చూపిన చోటే నిర్మించాలి. ముగ్గు పోసుకున్నాక గ్రామ కార్యదర్శికి చెబితే ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. 400 చ.అ. కంటే తక్కువగా నిర్మాణం చేపట్టొద్దు. పునాది పూర్తయ్యాక తొలిదశలో రూ. లక్ష జమ చేస్తారు. 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇచ్చి, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్, స్టీలు తక్కువ ధరకు అందేలా చూస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశను బట్టి AE/MPDOలు నగదు జమకు సిఫార్సు చేస్తారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చూడాలన్నారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట బాధ్యతను కలెక్టర్లు, ఎస్పీలకు ఇవ్వాలని సూచించారు.