AP Thalliki Vandhanam Scheme Latest Update
చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో 1-12 చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని వివరించారు.
రైతు ప్రస్థానం : తల్లికి వందనం’పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అమలుకు 2025-26 విద్యా సంవత్సరానికి గానూ రూ.9,407కోట్లు కేటాయించినట్లు చెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో 1-12 చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఉచితంగా విద్యుత్ అందజేస్తామన్నారు.తల్లికి వందనం (రూ.15,000), అన్నదాత సుఖీభవ (రైతుకు రూ.20,000) పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా, ఏడాదికి రూ. 250 చొప్పున పెంచిందని లోకేశ్ విమర్శించారు.
FAQ