Today World Wide Current Affairs 2025
‘రివర్ బ్లెండ్నెస్ ఫ్రీ’ కంట్రీగా నిలిచిన తొలి ఆఫ్రికా దేశంగా నైగర్ నిలిచింది. ఈమేరకు WHO ప్రకటించింది. ఈ వ్యాధిని ఒంకోసెర్సియాసిస్, రివర్ బ్లెండ్నెస్ అని పిలుస్తారు. ఓంకోసేర్కావోల్వులస్ అనే పరాన్నజీవి కారణంగా ఇది సంక్రమిస్తుంది. దురద, చర్మం కింద కణతులు ఏర్పడుతాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా అంధత్వం వస్తుంది.
భారత్ వేదికగా బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రైన్యూర్షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరగనుంది. మార్చి 3 నుంచి 7వరకు జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల యువ ప్రతినిధులు ఆలోచనలు, అనుభవాలను పంచుకోనున్నారు. ఈ సమావేశం యొక్క థీమ్ యూత్ ఎంటర్ప్రైన్యూర్షిప్ ఫర్ సస్టైనబుల్
దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ
దేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర ఐటీశాఖ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డెరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, L&Tసంస్థల ప్రతినిధులు, కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ అధికారులు, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిపుణులు ఉన్నారు. డిజిటల్ ట్రాన్సఫర్మేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, పాలసీ ఫార్ములేషన్పై ఈ యూనివర్సిటీ దృష్టిపెట్టనుంది.
దేశంలో 89కి చేరిన రామసర్ సైట్స్
భారత్లో రామసర్ చిత్తడినేలల సంఖ్య 89కి చేరింది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా కొత్తగా 4 రామ ్సర్ చిత్తడినేలలను గుర్తించారు. తమిళనాడులోని సక్కరకొట్టాయి బర్డ్ శాంక్చుయరీ, థెరథంగల్ బర్డ్ శాంక్చుయరీ, సిక్కింలోని కిచియోపల్లి వెర్ల్యాండ్, ఝార్ఖండ్లోని ఉద్వా లేక్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అత్యధికంగా రామసర్ చిత్తడినేలలు తమిళనాడు(20)లో కలవు. ఈ ఏడాది చిత్తడినేలల దినోత్సవం థీమ్ ప్రొటెక్టింగ్ వెట్ ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్.
మత మార్పిడులపై రాజస్థాన్ బిల్లు
రాజస్థాన్ ప్రభుత్వం మతమార్పిడులపై బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆ బిల్లు ప్రకారం మత మార్పిడి చేసుకోవాలనుకుంటే 2 నెలల ముందు కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఎవరి బలవంతం లేదని తెలిపితేనే అనుమతి లభిస్తుంది. ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే 2-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తారు.
గుజరాత్లో UCC ఏర్పాటుకు కమిటీ
ఉమ్మడి న్యాయ స్మృతి (UCC) డ్రాఫ్ట్ తయారీకి గుజరాత్ సుప్రీం కోర్టు మాజీ జడ్జి రంజనా దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చట్టం చేస్తామని CM భూపేంద్ర పటేల్ తెలిపారు. దేశవ్యాప్తంగా UCC అందరికీ సమాన హక్కులు ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.
స్వచ్ఛంద మరణం హక్కు కర్ణాటకలో అమలు
ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ లైఫ్ సపోర్టుతో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న వారికి గౌరవంగా చనిపోయే హక్కును కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మొదట ముగ్గురు డాక్టర్లు రోగి పరిస్థితిని సమీక్షిస్తారు. తర్వాత ప్రభుత్వం నియమించిన డాక్టర్, మరో ముగ్గురు డాక్టర్ల బృందం సమీక్షించి రిపోర్టును కోర్టుకు పంపుతుంది. కోర్టు ఆమోదిస్తే లైఫ్ సపోర్ట్ తొలగించడం లేదా ఇంజెక్షన్లు ఇస్తారు.
రేవాలో తెల్ల పులుల బ్రీడింగ్ కేంద్రం
మధ్యప్రదేశ్లోని రేవాలో భారత్లో మొట్టమొదటి తెల్ల పులుల బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ బ్రీడింగ్ సెంటర్ ద్వారా జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానికులకు ఉద్యోగావకాశాలను సృష్టించవచ్చని భావిస్తున్నారు.
విదేశాలకు పెరిగిన పళ్లు, కూరగాయల ఎగుమతులు
APEDA ఆర్థిక సహకారంతో గత ఐదేళ్లలో భారత్ నుంచి పళ్లు, కూరగాయల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధిరేటు 41.5% అని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది.
కొబ్బరి ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్
కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2023-24లో 23.33లక్షల హెక్టార్లలో సాగయిన కొబ్బరి తోటల నుంచి 153.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. ఏపీలో 1.07లక్షల హెక్టార్లలో 11.81లక్షల టన్నులు దిగుమతి రానుందని చెప్పారు.
‘స్కిల్ ఇండియా’ 2026 వరకు పొడిగింపు
‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని 2026 వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. రూ.8,800 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0, జన్ శిక్షణ్ సంస్థాన్, PM-NAPS పథకాలను భాగం చేసింది. అలాగే జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీ కాలాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది.
Games
- భారత్ విశ్వవిజేతగా రెండోసారి అవతరించింది. మలేషియా వేదికగా జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో మొత్తం 16 టీమ్ లు పాల్గొనగా.. 41 మ్యాచ్లు జరిగాయి. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా గొంగడి త్రిష నిలిచారు.
- భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ KKR, SRH, GT, పంజాబ్కు ఆడారు. సాహా 40 టెస్టుల్లో 1,353 పరుగులు, 9 వన్డేల్లో 41, 122 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 6,423 రన్స్ చేశారు.
- ఇంగ్లండ్తో జరిగిన ఐదో T20లో భారత జట్టు 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 4-1తేడాతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు(135), అత్యధిక సిక్సులు(13) కొట్టిన భారత ఆటగాడిగా నిలిచారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ అభిషేక్ రెండవ ర్యాంకుకు చేరుకున్నారు. తొలిస్థానంలో ట్రావిస్ హెడ్, మూడో స్థానంలో తిలక్ వర్మ ఉన్నారు
- T20 క్రికెట్ (ఇంటర్నేషనల్+లీగ్స్)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ ఖాన్ రికార్డు సృష్టించారు. 460 మ్యాచ్లలో 632 వికెట్లు పడగొట్టి బ్రావో(631 వికెట్లు)ను వెనక్కినెట్టారు. 26 ఏళ్లకే ఈ ఫీట్ నమోదు చేశారు.
- పురుషుల హాకీ ఇండియా లీగ్ విజేతగా బెంగాల్ టైగర్ జట్టు నిలిచింది. ఫైనల్లో బెంగాల్ టైగర్స్ 4-3 తేడాతో హైదరాబాద్ తుపాన్ జట్టును ఓడించింది. బెస్ట్ గోల్ కీపర్గా బ్రికమ్జీత్ సింగ్, అప్కమింగ్ ప్లేయర్గా అర్షదీప్, టాప్ స్కోరర్గా జుగ్రాజ్ సింగ్, బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సుఖ్ జీత్ సింగ్ ఎంపికయ్యారు…
- టాటా స్టీల్ చెస్ మాస్టర్స్-2025 ఛాంపియన్ షిప్ విజేతగా ఆర్.ప్రజ్ఞానంద నిలిచారు. నెదర్లాండ్స్ లోని విక్ ఆన్ జీలో జరిగిన టైబ్రేక్లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ను ఓడించి టైటిలు సొంతం చేసుకున్నారు. విశ్వనాథన్ ఆనంద్ (2006) తర్వాత ఈ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయుడిగా ఘనత సాధించారు.
Economy
- దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.
- తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది జనవరిలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.
Science and Technology
- మార్చిలో నిసార్ ఉపగ్రహాన్ని GSLV-F16 రాకెట్ ద్వారా ఇస్రో నింగిలోకి ప్రయోగించనుంది. 2,800 కేజీ బరువున్న దీనిని నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఉపగ్రహంలోని పెలోడ్స్ భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడటం వంటి వాటి గురించి సమాచారం అందిస్తుంది. శాటిలైట్లోని ఎస్ బ్యాండ్, సింథటిక్ అపార్చర్ రాడార్ ను ఇస్రో రూపొందించగా, ఎల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ ను నాసా రూపొందించింది.
- చంద్రుడిపై రాతి నమూనాలను తీసుకొచ్చే చంద్రయాన్-4ను ఇస్రో 2027లో లాంచ్ చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మిషన్లో LVM-3 రాకెట్ ద్వారా సాంకేతిక సామగ్రిని పంపి చంద్రుడి కక్ష్యలోనే అసెంబుల్ చేస్తారని వివరించారు. వ్యోమగాములను రోదసిలోకి పంపే గగన్యోన్ ప్రాజెక్టులో వ్యోమమిత్ర అనే రోబోను పంపిస్తామన్నారు. సముద్ర గర్భంలో 6000మీ. లోతుకు వెళ్లే సముద్రయాన్ను 2026లో లాంచ్ చేస్తామన్నారు.
- వ్యవసాయ అభివృద్ధి కోసం ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE) అగ్రిహబు ప్రారంభించింది. ఇది ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ద్వారా కరువు, వరదలు, తక్కువ ఉత్పాదకత వంటి సమస్యలకు పరిష్కరాలను చూపిస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ ఇంక్యుబేషన్, పరిశ్రమల సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులు, పరిశోధకులు, అగ్రి బిజినెస్ను బలోపేతం చేస్తుంది.
- కంటి నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ కవచం దెబ్బతిన్నప్పుడు కంటిచూపు మందగిస్తుంది. అలా కోల్పోయే వారి చూపును మెరుగుపరిచే సామర్థ్యమున్న ఔషధాన్ని అమెరికాలోని కొలరాడో పరిశోధకులు అభివృద్ధి చేశారు. LL341070గా పిలుస్తున్న ఈ ఔషధం మైలిన్ మరమ్మతు విషయంలో శరీరానికి సాయంగా నిలుస్తుందని వారు వివరించారు. త్వరలో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.
- చంద్రుని దక్షిణ దృవంలో నీటి జాడ కోసం చైనా చాంగ్- 7 ప్రయోగానికి సిద్ధవుతోంది. ఇందుకోసం 6 కాళ్లతో కూడిన ఫ్లయింగ్ రోబోను పంపాలనుకుంటోంది. రాకెట్ ప్రొపల్షన్ ను ఉపయోగించుకుని ఈ రోబో పాకడం, దూకడం, ఎగరడం ద్వారా అక్కడి విషయాలను అన్వేషించాలనుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. మరోవైపు తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో చైనాకు చెందిన షెంజౌ 19 వ్యోమగాములు కృత్రిమంగా కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆక్సిజన్, ఇథిలిన్ ను ఉత్పత్తి చేశారు.
- DRDO ఇండస్ట్రీ అకాడెమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లార్జ్ ఏరియా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ(LAAM)అభివృద్ధిలో ముందడుగు వేసింది. డీఆర్డీవోకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ లాబొరేటరీ, ఐఐటీ హైదరాబాద్, వివిధ పరిశ్రమ సహకారంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. LAAM వ్యవస్థ రాకెట్ భాగాలను తయారు చేయడానికి పౌడర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ డిపోజిషన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది.
మాల్దీవ్స్ వేదికగా ఎకువెరిన్ విన్యాసం
భారత్, మాల్దీవ్స్ సంయుక్త సైనిక విన్యాసం ఏకువరిన్ 13వ ఎడిషన్ మాల్దీవ్స్ వేదికగా జరుగుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 15వరకు ఈ విన్యాసం నిర్వహించనున్నారు. ఎకువరిన్ అనగా ఫ్రెండ్స్ అని అర్థం. అంతకుముందు ఈ విన్యాసంను 2023లో ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో నిర్వహించారు.
UNకు డబ్బు సాయం చేసిన భారత్
UN రెగ్యులర్ బడ్జెట్ 2025 కోసం భారత్ $37.64 మిలియన్లు(రూ.327 కోట్లు) చెల్లించింది. సరైన సమయంలోగా డబ్బులిచ్చిన 35 గౌరవ సభ్యదేశాల సరసన నిలిచింది. ఈ సంస్థ నిర్వహణకు ఏటా సభ్యదేశాలు డబ్బులు ఇస్తాయి..
FAQ