No Fast Tag Charges NHAI introduced GNSS ways
వాహన దారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడా కూడా టోల్ కట్టవలసిన పని లేకుండా కొత్త టోల్ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గ్డఖరి పనులు ప్రారంభించారు దీని ద్వారా ఒకరి ఫాస్ట్ టాగ్ ను మరొకరువినియోగించకుండా ఊడేందుకే ఈ చర్యలు తీసుకున్నాం అని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరు ఆగి టోల్ చార్జీలు చెల్లించి వెళ్లడం వలన చాలా ఎక్కువ మొత్తంలో టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ పెరుగుతుందని కేంద్రం ఫాస్ట్ టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చింది దీని ద్వారా సమయం తగ్గడంతో పాటు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఇంకా మరింత సమయం తగ్గించేందుకు కేంద్రం gps విధానాన్ని అందుబాటులోకి తేనుంది ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క వెహికల్స్ తమ రోడ్ టాక్సలో టోల్ ఛార్జ్ కట్ అవ్వుతుంది అని తెలిపింది.
జీఎన్ఎస్ఎస్ వల్ల లాభాలు?
- ఫాస్టాగ్ స్థానంలో రాబోయే కొత్త టోల్ విధానం ద్వారా మీరు ప్రయాణించే దూరానికే టోల్ రుసుము పడుతుంది.
- కొత్త టోల్ వసూలు వ్యవస్థను ప్రారంభ దశలో ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలకు అమలు చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) భావిస్తోంది.
- ఆ తర్వాత దశలో ప్రైవేట్ వాహనాలను ఇదే విధానంలో చేర్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
- కొత్త టోల్ వ్యవస్థ వచ్చిన తర్వాత టోల్ ప్లాజాలను తొలగిస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.
- దీంతో హైవేపై సుఖవంతమైన ప్రయాణం చేయవచ్చు. ట్రాఫిక్ తగ్గడం వల్ల వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది.
జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
- ఫాస్టాగ్ లానే జీఎన్ఎస్ఎస్ కూడా RFID టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ ట్యాగ్ను విండ్ షీల్డ్పై ఉంచాలి. ఆ తర్వాత జీఎన్ఎస్ఎస్ శాటిలైట్ ద్వారా వాహన కదలికలను ట్రాక్ చేస్తుంది. దీంతో వాహనం ప్రయాణించిన దూరం ఆదారంగా టోల్ రుసుము వసూల్ అవుతుంది.
- జీఎన్ఎస్ఎస్ ఆధారంగా మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అవుతుంది. కొత్త టోల్ విధానంలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ బిల్లింగ్ ఆప్షన్లు ఉంటాయని భావిస్తున్నారు.
FAQ