Indiramma Indlu Scheme First Phase List Releas
తొలి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు మొదలుపెట్టనున్నారు. బేస్మెంట్ పూర్తిచేసిన వారి అకౌంట్లలో ఈ నెల 15నాటికి రూ. లక్ష చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు ప్రస్థానం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట తొలి విడుతా విడుదల చేసిన విషయం తెలిసిందే తొలి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు మొదలుపెట్టనున్నారు. బేస్మెంట్ పూర్తిచేసిన వారి అకౌంట్లలో ఈ నెల 15నాటికి రూ. లక్ష చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇందుకోసం రూ.715 కోట్లు సిద్ధం చేస్తోంది. వారికి దశలవారీగా రూ.5 లక్షలు ఇవ్వనున్న విషయం తెలిసిందే.పేదలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. నారాయణపేట (D) అప్పకపల్లెలో CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 72,045 ఇళ్లకుగాను MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పనులు ప్రారంభమవుతాయి. లబ్ధిదారులకు బేస్మెంట్ లెవెల్లో లక్ష, గోడలు నిర్మించాక ₹1.25 లక్షలు, స్లాబ్ తర్వాత ₹1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక లక్ష ప్రభుత్వం అందజేయనుంది.