Central Approved Kedarnath and Hemkund Sahib
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కేదార్నాథ్ మరియు హేమకుండ్ సాహిబ్ అనే రెండు రోప్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
జాతీయ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ -పర్వతమాల పరియోజన కింద ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు 12.9 కి.మీ పొడవైన రోప్వే ప్రాజెక్ట్ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.4,081 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోన్ మార్గ్ కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్ట్ పూర్తి అయితే.. కేదార్ నాథ్ చేరుకునేందుకు సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సోన్ మార్గ్ నుంచి కేదార్ నాథ్ వెళ్లడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుండగా.. అదే ఈ రోప్ వే ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే కేవలం 36 నిమిషాల్లో కేదార్ నాథ్ చేరుకోవచ్చని తెలిపారు.
అత్యంత అధునాతన ట్రై-కేబుల్ డిటాచబుల్ గొండోలా (3S) సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది, ఇది రోజుకు 18,000 మంది ప్రయాణికులను మోసుకెళ్లే గంటకు 1,800 మంది ప్రయాణికుల (PPHPD) డిజైన్ సామర్థ్యంతో ఉంటుంది.ఈ రోప్వే ప్రాజెక్ట్ కేదార్నాథ్ను సందర్శించే యాత్రికులకు ఒక వరంలా ఉంటుంది ఎందుకంటే ఇది పర్యావరణ అనుకూలమైన, సౌకర్యవంతమైన మరియు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది.మొత్తం 12.9కి.మీ. మేర రోవ్వే వల్ల ఓ వైపునకు 8-9 గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం 36నిమిషాలకు తగ్గిపోనుంది. రోప్ వే నిర్మాణంలో ట్రై కేబుల్ డిటాచబుల్ గొండోలా టెక్నాలజీ(3S) ఉపయోగించనున్నారు