Telangana government giving 500 rupees bonus: ఈరోజు లేదా రేపు రైతుల ఖాతాలో వరి బోనస్

Telangana government giving 500 rupees bonus: ఈరోజు లేదా రేపు రైతుల ఖాతాలో వరి బోనస్

మరో రెండు రోజుల్లో రైతులకు 500 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లను విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలక్షన్ హామీలైన రెండు లక్షల రూపాయల రుణమాఫీ మరియు 500 రూపాయలు వరి పండించిన చూద్దాము. బోనస్ రూపంలో ఇస్తానని చెప్పింది ఇప్పుడు ఆ బోనస్  అమలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని మూడు దఫాలో అయితే విడుదల చేసింది మొదటి దఫను 50 వేల నుంచి లక్షలు రెండవ దఫాలో లక్ష నుంచి 150000 వరకు మూడోదఫాలో లక్షల 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలని మాఫీ చేస్తూ వచ్చింది. అందులోనూ కొంతమంది రైతులకు రుణమాఫీ అందలేదని వారు ధర్నాలు రాస్తారోకోలు చేపట్టగా వారికి ప్రత్యేకంగా యాప్ను ప్రవేశపెట్టి ఆ యాప్ ద్వారా ఎందుకు రైతు రుణమాఫీ కాలేదు అనే దని గురించి చర్చలు జరిపి అధికారులతో సర్వేలు జరిపించి వారికి కూడా రుణమాఫీని చేస్తూ ఉంది.

రైతు భరోసాను మొదట్లో వానాకాలం సీజన్ నుంచి ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని యాసంగి సీజన్ కి మార్చింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కు సంబంధించి ఇంతవరకు వివిధ విధానాలను విడుదల చేయలేదు ఇప్పుడైనా ఇస్తారా లేదా అనేది కూడా రైతులలో ఒక ప్రశ్న గానీ మిగిలిపోయింది దీనికి తోడు ఇప్పుడు సమగ్ర ఇంటింటి కుటుంబా సర్వే నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో రైతు భరోసా కు కోతపడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు సివిల్ సప్లై మినిస్టర్ అయినా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మరియు రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సన్నాలు కొనడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆరో రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాలో బోనస్తో సహా అన్ని డబ్బులు విడుదల అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క రైతుకు క్వింటాకు 500 రూపాయలు వరి పండించినందుకు గాను బోనస్ గా ఇస్తామని చెప్పింది. మళ్ళీ సన్నబరి పండించినందుకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం మేము ఎంపిక చేసిన సన్నాలకు మాత్రమే 500 రూపాయల బోనస్ను ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలపడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఐకెపిల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు జరుపుతోంది. ఈరోజు లేదా రేపు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

నిన్నటి వరకు 46 వేల టన్నులకు పైగా సన్నధాన్యం కొనుగోళ్లు జరిగాయి. క్వింటాకు ₹500 చొప్పున రైతులకు ₹2445 కోట్ల బోనసు చెల్లించాలని అధికారులు అంచనా వేశారు. దీంతో తొలివిడతగా ప్రభుత్వం రూ. 1000 కోట్లను విడుదల చేయగా, తొలుత మద్దతు ధర, ఆ తర్వాత బోనస్ చెల్లింపులు చేస్తారు. ఇవాళ లేదా రేపటి నుంచి చెల్లించే అవకాశం ఉంది.

Leave a Comment