కాలేజీలకు భారీ షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం |Telangana Govt given shock to private colleges 2025

Telangana Govt given shock to private colleges

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో స్కాలర్‌షిప్‌ల విషయంలో ఇంజినీరింగ్ సహా ఉన్నత విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని కాలేజీల్లోనూ తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో స్కాలర్‌షిప్‌ల విషయంలో ఇంజినీరింగ్ సహా ఉన్నత విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని కాలేజీల్లోనూ తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేసింది. దీనికి విద్యాశాఖ అధికారులు,పోలీస్ సహకారంతో తనిఖీలు చేపట్టి, నివేదిక ఇవ్వాలని ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

స్కాలర్‌షిప్‌ల మంజూరులో అక్రమాలు, ఫిర్యాదులపై ప్రభుత్వ విభాగాలు ఇటీవల శాంపిల్ తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీలలో అక్రమాలు జరిగినట్టు గుర్తించాయి. అయితే ప్రాథమిక నివేదిక ప్రకారం రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పరిధిలోకి వచ్చే డీఈడీ, బీఈడీ సహా అన్ని కాలేజీల్లో తనిఖీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు విజిలెన్స్‌ డీజీకి ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం సీఐడీ,పోలీసు,ఏసీబీ,కమిషనరేట్ల, ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీలు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా? విద్యార్థుల ప్రవేశాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా? ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు అవుతుందా? స్కాలర్షిప్లో అర్హులకు అందుతుందా? అనేవి విజిలెన్స్ అధికారులు తనీకి చేనున్నారు.

మరోవైపు ప్రైవేట్ కాలేజీలు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని ఇచ్చిన హామీలను ఇంతవరకు నిలుపుకోలేదని నవంబర్ మూడున బంధు కొనసాగిస్తామని తెలిపాయి వీటికి  విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.దసరాకు రూ. 600 కోట్లు విడుదల చేస్తామని, కేవలం రూ. 200 కోట్లతో సరిపెట్టింది. దీపావళి నాటికి మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పినా ఆ హామీ కూడా నెరవేరలేదు. దీంతో తక్షణమే బకాయిల విడుదలపై స్పష్టత ఇవ్వాలని కాలేజీల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. దాని ప్రతినిధులు మంత్రులను కలిసి తమ సమస్యను వివరించాయి. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బంద్ను ఎంచుకున్నాయి.

అంతేకాదు. విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదరింపులకు దిగినా భయపడే ప్రసక్తేలేదని ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సమావేశంలో స్పష్టం చేశారు. భయపెట్టాలని చూస్తూ లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఛలో హైదరాబాద్ చేపడతామని హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం 2500 ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు ఉండగా.. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో 15 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అయితే, ఫీజు రీయింబర్స్మెంట్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో గత ప్రభుత్వ హయాంలోనే విచారణకు ఆదేశించింది. ఇటీవల ప్రయివేట్ కాలేజీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ఈ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది.

Leave a Comment