Supreme court fire on Telangana govt on HCU
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని మీరు ఎలా చేతుల్లోకి తీసుకుంటారు’ అని CSపై ఆగ్రహిస్తూ ప్రతివాదిగా చేర్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిలో ఉన్న చెట్లను అభివృధి పేరుతో ప్రభుత్వం ఉగాది పండగ పర్వదినాన తొలగిస్తూ ఉంటే అది విద్యార్థుల కారణంగా పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే.. సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేసి అందులో it కారిడార్ నిర్మించడానికి లే అవుట్ చేయడానికి ఇప్పటికే 50 JCB లతో కొంత మేర వేల ఏళ్ళ తరబడి ఉన్న చెట్లను తొలగించింది. దీని వల్ల బయోడైవర్సిటీ దెబ్బతింటుంది అని నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసి విద్యార్థి నాయకులను జైళ్లు తరలించడంతో దీనిపై విద్యార్థులు కోర్ట్ కి వెళ్లగా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నరికివేయొద్దని, భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికపై విచారణ సందర్భంగా SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చెట్ల కొట్టివేతను సుమోటోగా చేపట్టాం. హైకోర్టు రిజిస్ట్రార్ స్పాట్కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో చెట్లు ఎందుకు తొలగించారు? 100 ఎకరాలు ధ్వంసం చేసినట్లు నివేదిక వచ్చింది. ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టారు? అనుమతులు తీసుకున్నారా?’ అని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 16లోగా నివేదిక ఇవ్వాలని GOVTను ఆదేశించింది.ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని మీరు ఎలా చేతుల్లోకి తీసుకుంటారు’ అని CSపై ఆగ్రహిస్తూ ప్రతివాదిగా చేర్చింది..
మరో వైపు ప్రతిపక్ష లీడర్స్ ఘాటుగా స్పందిస్తున్నారు.గచ్చిబౌలి కంచ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును BRS నేత హరీశ్రావు స్వాగతించారు.’ఈ తీర్పు CM రేవంత్ దుందుడుకు చర్యలకు చెంపపెట్టులాంటిది. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు కంచ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తానంటే చట్టం ఊరుకోదు. ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, సామాజికవేత్తల విజయం. వారికి అభినందనలు’ అని Xలో రాసుకొచ్చారు.ఇది అవిశ్రాంతంగా పోరాడిన HCU విద్యార్థుల విజయమని అభివర్ణించారు. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు, పర్యావరణ ప్రేమికులు, మీడియా, సోషల్ మీడియా మిత్రులకు థాంక్స్ చెప్పారు. మరోవైపు SC ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని BJP MP రఘునందన్రావు పేర్కొన్నారు.