ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం 8 మంది బ్రతికే ఉన్నారా | SLBC Tunnel Rescue Team Reached to Collapse 2025

SLBC Tunnel Rescue Team Reached to Collapse

ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టన్నెల్ కూలిన ప్రాంతానికి రెస్క్యూ టీమ్ చేరుకుంది. అక్కడ ధ్వంసమైన టీబీఎం భాగాలను వేరు చేస్తోంది. అలాగే టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. భారీగా మట్టి, బురద పేరుకుపోవడంతో డీ వాటరింగ్ ప్రక్రియ చేపట్టింది. మరోవైపు 2 రోజుల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువస్తామని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు.

రైతు ప్రస్థానం : రోజులు మారుతున్న slbc టన్నెల్ లో మాత్రం మార్పు క్కనిపించడం లేదు గత 5 రోజులు నుండి రెస్క్యూ టీం కష్టపడుతుండాన్గా 8 మంది ఆచూకీ ఇంత వరకు లభించలేదు ఇప్పుడే రెస్క్యూ టీం 8 మంది పై కుప్పకూలిన రూఫ్ వద్దకు చేరుకున్నారు.మరో వైపు jp అసోసియేట్స్ అధినేత 8 మంది చనిపోయారని మంత్రులతో మాట్లాడిన తరువాత టన్నెల్ పనులను ముందుకు కొనసాగిస్తాం అని అన్నారు.దీనికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం tmb మిషిన్ ను కట్ చేస్తున్నారు.కటింగ్ పూర్తయిన తరువాత విషయాలు వెల్లడైయ్యే ఛాన్స్ ఉంది.

Leave a Comment