pradhan mantri Man Dhan Yojana Guidlines 2025
వ్యవసాయానికి కేంద్రం మరియు రాష్ట్రం ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూ వస్తూనే ఉంది.ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు భీమా ను కల్పించడం కోసం ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన పథకాన్ని అందు బాటులోకి తీసుకు వచ్చింది ఆ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రైతులకు ఆర్ధికంగా ఆదుకుందుకు కేంద్రం మరియు రాష్ట్రం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.అంటే కాకుండా రైతులకు కొంత మేర గిట్టు బాటు ధరను కూడా కల్పిస్తూ వస్తుంది.ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంది.కానీ రైతుకు భీమా మాత్రం లేదు.కేంద్రం రైతులకు భీమా ను కల్పించాలనే ఉద్దేశంతో పస్సల్ భీమా ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.అలాజె ప్రతి ఒక్క రైతుకు రాష్ట్రం ఇస్తున్న పింఛన్ కాకుండా కేంద్రం నుండి కూడా పింఛన్ రూపం లో కొంత మొత్తం లో డబ్బు ఇవ్వాలని ఆలోచన చేసింది.ఆ పింఛన్ ను ప్రతి ఒక్క రైతుకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి మాన్ ధన్ యాజమా అనే పథకాన్ని అందు బాటులోకి తీసుకు వచ్చింది ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు 40 యేండ్లు నిండిన తరువాత పింఛన్ కింద ప్రతి నెల 3000 రూపాయలను కేంద్రం ఇవ్వనుంది ఆ పథకానికి సంబంధించి వివరాలు చూద్దాం..

ప్రధాన మంత్రి మాన్ ధన్ యోజన
ప్రధాన్ మంత్రి మాన్ ధన్ యోజన కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క రైతు 3000 రూపాయలను పింఛన్ కింద పొందవచ్చు.వయసు పెరిగే కొద్ది పథకం యొక్క ప్రీమియం కూడా పెరుగుతుంది.ఫర్ ఎక్సమ్ప్లె మీకు 18 ఏళ్ళ వయసు ఉంది అనుకుంటే మీరు కట్టాల్సిన ప్రీమియం వచ్చేసి 55 రూపాయలు ,అదే 20 ఏళ్ళ వయసు వారైతే 61 రూపాయే ,అంతే మొత్తాన్ని కేంద్రం జమ చేస్తుంది. ఇక.. 25 ఏళ్ల వారు రూ. 80, 30 ఏళ్ల వారు రూ. 105, 35 ఏళ్ల వారు రూ. 150 .. 40 ఏళ్ల వయస్సున్న రైతులు నెలకు రూ. 200 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పింఛను పొందుతున్న రైతు మరణిస్తే.. వారి భార్య లేదా భర్త నామినీగా ఉంటే.. వారికి జీవితాంతం నెలకు రూ. 1,500 పింఛను అందుతుంది. ఇది వారి వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆసరాగా నిలుస్తుంది.

ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం. పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)కి వెళ్లి పీఎం కిసాన్ కేఎంవై పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రైతు తమ ఆధార్ నంబరు .. నామినీ యొక్క వివరాలను అందించాలి. మాన్ధన్ దరఖాస్తును పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకుని.. దానిపై సంతకం చేసి తిరిగి పోర్టల్లో అప్లోడ్ చేయాలి.

విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత రైతుకు పీఎం కిసాన్ మాన్ధన్ పింఛను కార్డు వస్తుంది. పీఎం కిసాన్ పథకానికి అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతా నుండే ప్రీమియం డబ్బులు నేరుగా చెల్లించబడతాయి. ఒకవేళ మీరు పీఎం కిసాన్ లబ్ధిదారు కాకపోతే.. నేరుగా సీఎస్సీలో దరఖాస్తు చేసుకుని మీ పింఛను కార్డును పొందవచ్చు.