Decision not to re-recruit retired employees
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాల్లో ప్రధాన అంశాలు..ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ఒక డీఏను తక్షణమే చెల్లిస్తారు. మరో డీఏను ఆరు నెలల తర్వాత చెల్లిస్తారు.
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రతి నెల కనీసం ₹700 కోట్ల చొప్పున చెల్లించి క్లియర్ చేయాలని నిర్ణయించారు.ఉద్యోగుల ఆరోగ్య అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా హెల్త్కేర్ ట్రస్ట్ ఏర్పాటు.కేడర్ ర్యాంక్ ప్రకారం గ్రామ పంచాయతీ సెక్రటరీలకు గ్రేడింగ్.. క్రమం తప్పకుండా డిపిసి ప్రమోషన్లు..జిల్లాల స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీల ఏర్పాటు.. కొత్తగా నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు..అంగన్వాడీ వర్కర్లకు ₹2 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్..ఇకపై రిటైర్డ్ ఉద్యోగుల రీ-రిక్రూట్మెంట్ చేయరాదని నిర్ణయం.భద్రాద్రి కొత్తగూడెంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి దివంగత మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గారి పేరు.ప్రమాదవశాత్తు మరణించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా పాలసీ లేకున్నా ప్రభుత్వం నుంచి నేరుగా ₹10 లక్షల పరిహారం అందజేస్తారు. గత ఏడాది 385 మంది మృతులైన వారికి ₹38.5 కోట్ల పరిహారం చెల్లింపునకు కేబినెట్ ఆమోదం.
రాష్ట్ర వ్యాప్తంగా R&B, పంచాయతీ రాజ్ విభాగాల కింద మొత్తం 13,000 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధిని చేపట్టాలని నిర్ణయం.హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి మొత్తం 86 కి.మీ పొడవైన మార్గాన్ని ₹19,579 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కేబినెట్ నిర్ణయించింది.