Indiramma Illu First Phase List Released : ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ జాబితా విడుదల మీ పేరు ఉందా
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు.తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలి.అందుకోసం అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఇందిరమ్మ యాప్లో ఎలాంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా చూడాలి.
ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.లబ్దిదారులు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలి.ఈ పథకం సమర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలి.మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ హామీలలో ఒకటైన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తయారు చేస్తుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారం నుండి అర్హుల జాబితాను సిద్ధం చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నివేదికల ప్రకారం మొదటగా ఎవరైతే సొంతంగా ఇంటి స్థలం ఉండి ఇల్లును నిర్మించుకోవడానికి ఆర్ధిక స్థోమత లేక నిర్మాణ పనులు ఆపుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం మొదటి జాబితాలోకి తీసుకోనున్నట్లు సమాచారాం వారి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చు ను నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం నిధులను సమకూర్చుకుంటుంది.ఆ తరవాత స్థలాలను పేద వారికి కేటా ఇంచి ఆ స్థలాలలో ఇంటిని నిర్మించనుంది