PM Farmers Producer Organization Scheme 2024: రైతులు కేంద్రం ఇస్తున్న ఈ స్కీం ద్వారా 15 లక్షల నుండి 2 కోట్ల వరకు రుణాన్ని పొందవచ్చు.
రైతుల కోసం రైతులను వ్యాపారస్తులుగా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది అందులో ఒక పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Over View Of Scheme
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను ఇప్పటికే ప్రవేశపెట్టింది అలాగే ఇంకా ప్రవేశ పెడుతూనే ఉంది రైతులను దేశానికి వెన్నెముకగా మార్చే దిశగా అయితే ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికోసం రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తూ ఉన్నారు ఆర్థికంగా గాని మరియు కొత్త రకం ఆలోచనలను కలిగించే విధంగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీని కోసమని ఇప్పటికే రసాయనక పంటలను పండించకుండా ఆర్గానిక్ పండ్లను పండించడం కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఇప్పుడు రైతులను వ్యాపారస్తులుగా మార్చడం కోసం ఒకే రాష్ట్రం ఒకే బజార్ నినాదంతో మరో పథకాన్ని అయితే దేశంలోకి తీసుకొచ్చారు. ఆ పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పథకం. ఈ పథకాన్ని ప్రధానమంత్రి మోడీ 14 ఏప్రిల్ 2016న సోలాపూర్ వేదికగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రైతులు ఒక సమూహంగా ఏర్పడి తమ వ్యవసాయ పంటను ఒక ఆర్గనైజేషన్ గా మార్చుకోవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఈనామ్ అనే వెబ్సైట్ని లాంచ్ చేసింది ఈనాం వెబ్సైట్ ద్వారా రైతులు తమ యొక్క ఉత్పత్తులను ట్రేడింగ్ చేసుకోవచ్చు.

ఈనామ్ వెబ్సైట్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ప్రపంచానికి తెలియజేయడంతో పాటు ఆన్లైన్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు దీనికోసం అని కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల వరకు రుణాలను అయితే మంజూరు చేస్తుంది దీన్ని నాలుగు విధాలుగా అయితే ఇస్తుంది.
- ఒకటి డొనేషన్
- గ్రాంటు
- గిఫ్ట్
- లోన్స్
మొదటగా రాష్ట్రంలో నాబార్డ్ ద్వారా కో-ఆపరేటివ్ బ్యాంకు నుంచి రైతులకు పెట్టుబడి సహాయంగా 15 లక్షల రూపాయలను అయితే లోన్ గా ఇవ్వడం జరుగుతుంది. డొనేషన్ గ్రాండ్ గిఫ్ట్ రూపంలో రెండు కోట్ల వరకు డబ్బును జమ చేసి రైతుల ఖాతాలో ఇవ్వడం జరుగుతుంది ఈ 15 లక్షల రూపాయలను లోన్ గా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో దశలవారీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోను కేవలం రైతులు తమ యొక్క బిజినెస్ను ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం మరియు తమ యొక్క ఉత్పత్తులను పెంచుకోవడం కోసం మాత్రమే ఉపయోగించడం ఇస్తుంది దీనికి సంబంధించి ఎవరు అర్హులు అనేదాని గురించి తెలుసుకుందాం..

అర్హులు
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఎఫ్ఈఓ పథకం కింద అప్లై చేసుకోవాలి అంటే కచ్చితంగా వారు ఇండియన్ అయి ఉండాలి అలాగే తాను రైతువృత్తిలో కొనసాగుతూ ఉండాలి.
- ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం రైతు సమూహంగా ఏర్పడాలి అంటే దాదాపు 11 మందితో ఒక సమూహంగా రైతు ఏర్పడి తమ యొక్క సంస్థను నిర్మించుకోవాలి.

ఎలాంటి ఆర్గనైజేషన్ రైతులు నిర్మించాలి
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న ఈ పథకం కేవలం రైతులు తమ యొక్క వ్యవసాయ సంబంధిత సమస్యలు నిర్మించడానికి మాత్రమే 15 లక్షల వరకు రుణాన్ని అందించడం జరుగుతుంది. అవి
- పండ్లను మార్కెట్లో కి అందుబాటులోకి తెచ్చే సంస్థ గాని
- ఫెస్టిసీడ్స్ ను తయారు చేసే సంస్థగాని
- మార్కెట్ యర్డును నిర్మించడం గాని
- వసాయానికి సంభందించి కొత్త పద్ధతులను తెలపడం కోసం సంస్థ ఏర్పాటు
- ట్రేడింగ్ చేయడం
- ఫుడ్ యొక్క నాణ్యతను నిర్ణయించే సంస్థ గాని పెట్టుకోవచ్చు
దరఖాస్తు చేసుకోవడం ఎలా
ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే అప్లై చేసుకునే వ్యక్తి రైతయ్యి ఉండాలి తాను ఒక 11 మందితో సమూహంగా ఏర్పడి ఉండాలి. ఏర్పడిన తర్వాత ఈయన అనే వెబ్సైట్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు ఈయన అనే వెబ్సైట్లో దాదాపు 12 భాషలతో అయితే ఈ వెబ్సైట్ రన్ అవుతుంది అలాగే దీనికి సంబంధించి ఈనానికి సపరేట్గా కేంద్ర ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ ని అయితే తీసుకొచ్చింది. దీంట్లో కూడా 12 లాంగ్వేజ్లతో అయితే ఆప్ ను నిర్మించడం జరిగింది.ముందుగా ఈ పథకం అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లాలి. హోమ్పేజీలో ఎడమవైపు పైన FPO ఆప్షన్ క్లిక్ చెయ్యాలి. రిజిస్టర్ అయ్యి, లాగిన్ అవ్వాలి.లాగిన్ అయ్యాక.. అప్లికేషన్ ఫారంలో అడిగిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో రిజిస్ట్రేషన్ కోసం, మీరు FPO ఎండీ (MD) లేదా సీఈవో (CEO), లేదంటే మేనేజర్ పేరు, చిరునామా, ఇ-మెయిల్ IDతోపాటు, మొబైల్ నంబర్ ఇవ్వాలి.

అప్లికేషన్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ నమ్ వెబ్సైట్ సీఈవో అప్లికేషన్ ని క్షుణ్ణంగా పరిశీలించి రుణం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అప్రూవల్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 15 లక్షల వరకు రుణాలని ఇవ్వడంతో పాటు వివిధ సంస్థల ద్వారా డొనేషన్ గ్రాండ్ గిఫ్ట్ లోన్స్ రూపంలో అయితే రెండు కోట్ల వరకు రుణాలను అయితే ఇప్పించడం జరుగుతుంది. ఈ రుణం వచ్చేంతవరకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.మనీ వచ్చాక, FPOకి ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. FPOలకు.. ఆన్బోర్డింగ్ ఆన్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (e-NAM) అనేది ఉంటుంది. వారు అందులో తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు.
ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఉత్పత్తులను ఎలా అమ్ముకోవాలి
ఒక ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లోకి తీసుకువెళ్లి అమ్ముకోవచ్చు.ఒకవేళ మార్కెట్లోకి కనుక తీసుకువెళ్లి అమ్ముకో లేకపోతే ఇనాం వెబ్సైట్లోనే నేరుగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు.

ఈయన వెబ్సైట్ యొక్క ప్రయోజనాలు
- వాణిజ్యంలో పారదర్శకత
- ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా ధర ఆవిష్కరణ
- ఎలక్ట్రానిక్ బరువు ప్రమాణాల ద్వారా బరువు
- శాస్త్రీయ పరికరాల ద్వారా నాణ్యతను అంచనా వేయడం
- రైతు ఖాతాకు ఇ-చెల్లింపు
ఇప్పటికే ఈయన వెబ్సైట్లో ఒకటి పాయింట్ 1.72 కోట్లకు పైగా రైతులు ఉన్నారు.రెండు వేలకు పైగా రైతులు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు.రెండు లక్షలకు పైగా రైతులు ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. ఒక లక్షకు పైగా కమిషన్ ఏజెన్సీ ఈ వెబ్సైట్లో పనిచేయడం జరుగుతుంది.ఈ ఇనాం వెబ్సైటు ఇప్పటి 18 రాష్ట్రాలు భాగస్వామ్యంగా పనిచేస్తూ ఉన్నాయి.
కొత్త ఫీచర్లు:
- FPO మాడ్యూల్
- వాతావరణ సూచన మాడ్యూల్
- 5 కొత్త సెటిల్మెంట్ బ్యాంకులు ఏకీకృతం చేయబడ్డాయి
GOI ఇ-పోర్టల్లతో లింక్ చేయబడింది:
- AGMARKNET
- రైతు ప్రయోజనాలు
- ఉమంగ్
మరింత ఇన్ఫర్మేషన్ కోసం1800 270 0224 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చెయ్యవచ్చు, అలాగే మీకు దగ్గర్లోని వ్యవసాయ శాఖ అధికారులను కలిసి, వివరాలు కోరవచ్చు.