ఇకపై ముస్లిమ్స్ ఆలా చేస్తే లైసెన్సులు రద్దు చేస్తాం అన్న యూపీ | UP Government Shocking to Muslims for Ramzan 25

UP Government Shocking to Muslims for Ramzan

మరో 3 రోజుల్లో రంజాన్ ఉండాగా అప్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు బాడ్ న్యూస్ చెప్పింది ఇకపై వారి లైసెన్సులు రద్దు చేస్తాం అని ప్రకటించింది

రైతు ప్రస్థానం: దేశంలో మరో రెండు రోజుల్లో ఉగాది మరియు మరో 3 రోజుల్లో ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండగ ఉండడంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు షాకింగ్ న్యూస్ చెప్పింది.యూపీలో ముస్లింలకు అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్కు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై నమాజ్ చేయొద్దని తేల్చిచెప్పారు. అలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే వారి పాస్పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ‘ఈద్ ప్రార్థనల్ని మసీదులు లేదా ఈద్గాల్లోనే చేయాలి. రోడ్లపై చేసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.ట్రాఫిక్ సమస్యలను దృధాటిల్ ఉంచుకునే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.చాలా మంది ముస్లిమ్స్ పండగ ముందే నెల రోజుల పాటు ఉపవాసం చేస్తారు.చివరి రోజు వారికి ముఖ్యమైన రోజు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు

Leave a Comment