Telangana Indira Women Dairy Scheme 2025
ప్రస్తుతం మహిళలకు 80 శాతం సబ్సిడీపై గేదెలను అందిస్తుండగా, దాణాను 50 శాతం సబ్సిడీపై సప్లైచేస్తున్నారు. భవిష్యత్ లో గడ్డి పెంచేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు నిరుద్యోగులకు పశువుల దాణా తయారీ, ప్యాకింగ్, సరఫరా యూనిట్లు, రిటెయిల్ గా పాల ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఉపాధి కల్పించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
మధిర నియోజకవర్గంలో ఈ స్కీమ్ సక్సెస్ అయితే ఇందిరా మహిళా డెయిరీని రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలకు క్రమంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2013లో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పదకొండేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన సొంత నియోజకవర్గంలో ఈ స్కీమ్ను ప్రారంభించారు.
రూ.500 కోట్ల టర్నోవర్ సాధించేలా ప్లాన్
ఎంపిక చేసిన మహిళలకు రెండు గేదెల చొప్పున ఇందిరా మహిళా డెయిరీ స్కీమ్ కింద గ్రౌండింగ్ ప్రారంభమైంది. 20 వేల మంది లబ్ధిదారులకు గేదెల పంపిణీ పూర్తయితే రోజుకు 2.40 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. వీటి ద్వారా నెలకు రూ.25 కోట్లకు పైగా మహిళలు సంపాదించే అవకాశం ఉంటుంది. పాలతో పాటు పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, పన్నీర్, స్వీట్స్ వంటి ప్రొడక్ట్స్ తయారు చేయడం ద్వారా టర్నోవర్ రూ.500 కోట్లకు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నాం.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. మహిళలు పాడి పరిశ్రమపై దృష్టిసారించి, ఆదాయం పొందేలా ఇందిరా మహిళా డెయిరీని ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది. వ్యవసాయంతో పాటు పాడి ఆదాయం కలిస్తే రైతు కుటుంబాలు మరింత నిలదొక్కుకుంటాయి. 2013లో నాకు వచ్చిన ఈ ఆలోచనను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికీ అవకాశం దొరికింది. – భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
ఇందిరా మహిళా డెయిరీ స్కీమ్ కింద రెండు గేదెలు ఇచ్చారు. బ్యాంకులో రూ.40 వేలు కట్టగా, రూ.1.60 లక్షలు మాఫీ వచ్చిందని చెప్పారు. ఈ రెండు గేదెలు రోజుకు ఐదారు లీటర్ల పాలిస్తున్నాయి. మా కుటుంబానికి భరోసా చూపించిన రాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రుణపడి ఉంటాం..