ఉగాది నుండి QR కోడ్ తో కొత్త రేషన్ కార్డులు | Telangana government Releasing Ration Cards 2025

Telangana government Releasing Ration Cards

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను రేపటి నుండి ప్రారంభించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని తెలిపిన విషయం తెలిసిందే

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డులకు నోటిఫికేషన్ లేక ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లను తొలగించుకుని ప్రజలు ఇబ్బదులు పడుతున్న విషయం తెలిసిందే..ఐతే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేజిక్కించుకున్న వెంటనే కొత్త రేషన్ కార్డులకు ప్రజాపాలన ద్వారా అప్లికేషన్స్ తీసుకుంది.వాటిద్వారా అర్హులను గుర్తించి అర్హులైన వారికి ఉగాది సందర్బంగా ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అని పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం.

కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్ట్లో ఉంటే చాలు ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం ఇస్తాం. తెలంగాణ ఏర్పాటు నాటికి 89లక్షల 73వేల 708 కార్డులు ఉంటే.. గత పదేళ్ళలో 49వేల 479 కొత్త కార్డులు ఇచ్చారు. 90లక్షల రేషన్ కార్డులు. 2.85 కోట్ల లబ్దిదారులు ప్రస్తుతం ఉన్నారు.’ ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుంది. హుజూర్ నగర నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నాం. తెలంగాణలో 85శాతం జనాభాకు సన్నబియ్యం అందబోతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టం అందుబాటులోకి తెస్తున్నాం. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను ఆధారంగా ఇస్తున్నాం.

FAQ

Leave a Comment