Telangana Governemnt Cancellation Pensions 2025
ఇల్లందకుంటలో గుర్తించిన 41 మంది అనర్హులు గత ఐదేళ్లలో దాదాపు కోటి రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారు.దివ్యాంగులకు నెలకు రూ.4,000 పింఛన్ లభిస్తున్న నేపథ్యంలో ఈ అక్రమాలు ప్రభుత్వంపై తీవ్ర భారం మోపుతున్నాయి.
నిధులు పక్కదారి పడుతున్న సంక్షేమ పథకంలో పింఛన్లు ఒకటి నిజానికి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేసే పింఛన్ పథకాలు అర్హులైన వారికి చేరడం చాలా ముఖ్యం. కానీ, కొన్నిసార్లు ఈ పథకాలు అర్హతలేని వారికి చేరి ప్రజాధనం వృథా అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో జరిగిన ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఇక్కడ దివ్యాంగుల పింఛన్ల పంపిణీలో జరిగిన అక్రమాలను అధికారులు వెలికితీశారు. విజిలెన్స్ విభాగం చేపట్టిన పరిశీలనలో 41 మంది అనర్హులుగా తేలడంతో వారి పింఛన్లను తక్షణమే రద్దు చేశారు.
ఇల్లందకుంట మండలంలో 1116 మంది దివ్యాంగుల పింఛనుదారులు ఉండగా, వారిలో 116 మందిపై అధికారులకు అనుమానం కలిగి విజిలెన్స్ సమీక్ష తర్వాత, వీరిలో 41 మంది అనర్హులని స్పష్టమైంది. మిగిలిన 75 మందికి సంబంధించిన వైద్య నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఈ చర్యతో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పక్కదారి పట్టాయి న-అని పెద్ద చర్చ మొదలైంది. ఇది కేవలం దివ్యాంగుల కేటగిరీలోనే కాకుండా, ఆర్థికంగా స్థిరపడినవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు కూడా అక్రమంగా పింఛన్లు పొందుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.దీంతో పింఛన్ల రద్దుతో ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. అక్రమంగా పింఛన్లు పొందుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ఘటన ద్వారా అర్ధంఅవువుతోంది.
ఇల్లందకుంటలో గుర్తించిన 41 మంది అనర్హులు గత ఐదేళ్లలో దాదాపు కోటి రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారు. దివ్యాంగులకు నెలకు రూ.4,000 పింఛన్ లభిస్తున్న నేపథ్యంలో ఈ అక్రమాలు ప్రభుత్వంపై తీవ్ర భారం మోపుతున్నాయి. గతంలో కొంతమంది వైద్యులు డబ్బులకు ఆశపడి తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఒక డాక్టర్ను సేవలనుంచి తొలగించిన ఘటన కూడా జరిగింది.ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం దివ్యాంగుల పింఛన్లు మంజూరు చేయడంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల అనర్హుల పింఛన్లు బయటపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 23,172 మంది దివ్యాంగుల పింఛనుదారులు ఉన్నారు. మొత్తం లబ్ధిదారులలో దాదాపు 10 శాతం మంది అనర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజంగా అర్హులైన వారు ఇంకా పింఛన్ల కోసం ఎదురుచూస్తూ ఉండగా, ఈ ప్రజాధనం వృధాను అరికట్టడానికి మరిన్ని కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
అర్హుల ఎంపికలో పారదర్శకత పెంచడం, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం ద్వారా అక్రమ లబ్ధిదారులను సులభంగా గుర్తించవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు వచ్చి ఈ సమస్యపై పోరాడితే, నిజంగా అవసరమైన వారికి సహాయం అందుతుంది. లేదంటే, ఈ పింఛన్ల అక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి.