PM Modi New Scheme for Muslim Minorities 2025
రంజాన్ లో మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రంజాన్ కోసం కేంద్ర NDA ప్రభుత్వం 32 లక్షల మంది ముస్లింలకు కిట్స్ ప్రొవిదె చేస్తుంది.
ముస్లింలకు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలోని బీజేపీ గుడ్ న్యూస్ చెప్పింది.ఆర్థికంగా బలహీనంగా ఉన్న ముస్లిం కుటుంబాల కోసం ఈద్ సందర్భంగా ఈ సౌగత్-ఏ-మోడీ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ సౌగత్-ఏ-మోడీ కిట్లలో ఆహార పదార్థాలతో పాటు బట్టలు, సేమియా, ఖర్జూరా, డ్రై ఫ్రూట్స్, చక్కెర వంటి వస్తువులను అందిస్తున్నారు. మహిళల ధరించే సూట్లకు.. పురుషులు ధరించే కుర్తా పైజామాలకు కావాల్సిన బట్టను కూడా ఈ కిట్లలో అందిస్తున్నారు. ఈ కిట్ విలువ రూ.500 నుంచి రూ.600 వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రంజాన్ పండగ నేపథ్యంలో దేశంలోని 32 లక్షల మంది ముస్లిం కుటుంబాలకు కిట్లు పంపిణీ చేయాలని సౌగత్-ఏ-మోడీ పేరుతో ఈ కిట్లను ముస్లింలకు బీజేపీ పంపిణీ చేయనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం మంగళవారం ప్రారంభం అయింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దిఖీ ఈ సౌగత్-ఏ-మోడీ కిట్ల పంపిణీని మొదలు పెట్టారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో సౌగత్-ఏ-మోడీ కిట్ల పంపిణీ సందర్భంగా మాట్లాడిన జమాల్ సిద్దిఖీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ తాను 140 కోట్ల భారతీయులకు సంరక్షకుడిని అని చెబుతుంటారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ అన్ని పండుగల్లో పాల్గొంటారని తెలిపారు. క్రిస్మస్, ఈస్టర్, వైశాఖీ పండగల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారని.. నిజాముద్దీన్, అజ్మీర్ షరీఫ్ దర్గాలలో సమర్పించడానికి చాదర్లు కూడా పంపిస్తారని గుర్తు చేశారు.