PM KUSUM 2024 : 60% సబ్సిడీతో కేంద్రం కొత్త పథకం
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకు వస్తున్న విషయం తెలిసిందే అందులో అధిక లాభాన్ని ఇచ్చే ఒక పథకం

కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్ధికంగా ఆదుకోవడం మరియు యువ రైతులను ప్రోత్సహించడం కోసం ఎన్నో కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే కానీ ఈ పథకాల గురించి పల్లె ప్రాంతాల్లో ఉన్న ఎంతో మంది రైతులకు తెలియదు అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులు రైతుల కోసం కేంద్ర అందిస్తున్న పథకాల గురించి ఎన్నడూ తెలుపారు.
ఏదైనా ఒక పథకం గురించి తెలుసుకున్న రైతులు ఆ పథకం గురించి సంబంధిత శాఖల్లో అడిగిన కొంత మంది ఆ పథకం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారు.కొంతమంది అవునా ఎప్పుడు వచ్చింది అని మనకే ప్రశ్న వేస్తారు ,మరి కొంత మంది అయితే చెప్తే నాకేం ఇస్తావ్ అన్న రీతిలో మాట్లాడుతుంటారు. కాబట్టి ఎప్పటి కప్పుడు కేంద్రం రైతులకు కల్పిస్తున్న ప్రయోజనాలు తెలుసుకుని రైతులకు చెప్పండి.
కేంద్ర ప్రభుత్వం రైతులకు అధిక మొత్తములో లాభాలను సృష్టించడం కోసం ఒక పథకాన్ని తీసుకు వచ్చింది కానీ ఈ పథకం గురించి ఎక్కువగా రైతులకు తెలియదు. కేవలం పీఎం కిసాన్ మాత్రమే తెలుసు కానీ పీఎం కిసాన్ కన్నా ఎక్కువ మొత్తంలో ఈ పథకం ద్వారా డబ్బును పొందవచ్చు. ఆ పథకం పేరే ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఈవం ఉత్తాన్ మహాబియాన్ దీన్నే సింప్లెగా పీఎం కుసుమ్ యోజన అని పిలుస్తారు. ఈ పథకం ద్వారా మీ ల్యాండ్ లో ఉత్పత్తి అయ్యే కరెంటు ను అమ్మి లక్షల్లో లాభాలు పొందవచ్చు. మీ కరెంటు అమ్మడం కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు ఎందుకంటే మీ ల్యాండ్ లో ఉత్త్పత్రి అయినా విద్యుత్ని కేంద్ర ప్రభుత్వమే కొంటుంది .అది మీకు పెట్టుబడి సహాయాన్ని అందించి మరి.ఈ పథకం డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం…
పీఎం కుసుమ్ యోజన
పీఎం కుసుమ్ యోజన అనే పథకాన్ని 2019 లో పునరుత్పాదక ఇంధన శాఖ ప్రారంభించింది (Department of Renewable Energy ).దీని ద్వారా వ్యవసాయం కోసం రైతులు సోలార్ వ్యవసాయ పంపులు సబ్సిడీ ద్వారా కొనుగోలు చేయవచ్చు.ప్రతి రైతుకు కేంద్రం 40 నుండి 60 శాతం సబ్సిడీ ఇస్తుంది. దీని ద్వారా పంపుసెట్లు వేసుకోవడానికి,ట్యూబ్ బావులు వేసుకోవడానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ ఇవ్వగా మిగిలిన 10% డబ్బును రైతులు భారయెంచాల్సి ఉంటుంది.
పథకం లక్ష్యం
పీఎం కుసుమ్ యోజన ద్వారా ప్రాథమికంగా రైతులకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తేవడం. అలాగే వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయడం. సోలార్ పంపుల వలన రైతులకు మరింత అనుకూలమైన,ప్రభావ వంతమైన,పర్యావరణ అనుకూలమైన నీటి పారుదల సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇవి సురక్షితమైన విద్యుత్ని ఉత్పత్తి చేయగలవు. ఈ పంపుసెట్లు డీజిల్ తో నడిచే పంపుల కన్నా ఎక్కువ విద్యుత్ ని ఉత్పత్తి చేసే ఎనర్జీ పవర్ గ్రిడ్ ను కలిగి ఉంటాయి . కాబట్టి సోలార్ ద్వారా పొందే అదనపు కరెంటు ను రైతులు ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు.దాన్ని స్వయంగా స్థానికంగా ఉన్న డిస్కామ్లు కొంటాయి.
పథకం లోని భాగాలు
ఈ పథకంలో 3 భాగాలుగా ఫండ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అందులో
ఆ) మొత్తం 10gv గ్రిడ్ కనెక్ట్ చేసిన స్టీల్ మౌంట్ వికేంద్రీకృత సౌర ప్లాంటు ,ఇతర పునరుత్పాదక శక్తి ఆధారిత పవర్ ప్లాంట్స్ ను ఇన్స్టాల్ చేస్తారు .ఒక్కో ప్లాంట్ పరిమాణం 500kvw నుంచి 2 MV వరకు ఉంటాయి.
ఆ ) 7.5HP వ్యక్తిగత సామర్ధ్యం ,17. 50 లక్షల స్టాండ్ అలొన్ సోలార్ పంపులను ఇన్స్టాల్ చేస్తారు.
3) సోలరీస్ 10 లక్షల గ్రిడ్ కనెక్ట్ చేసిన వ్యవసాయ పంపులకు 7. 5HP సామర్ధ్యంతో ఆర్ధిక సహాయం పొందేలా చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి
ఈ పథకం కోసం ప్రభుత్వం 2 వెబ్సైట్ ని అందుబాటులో ఉంచింది.Website 1 లేదా Website 2
వీటితో పాటుగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పోర్టల్ ను తెరిచింది .తెలంగాణాలో https://pmkusum.telangana.gov.in/TS/landing.html ఆంధ్ర ప్రదేశ్ కోసం ప్రత్యేకమైన పోర్టల్ తెరవలేదు కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ రైతులు https://pmkusum.mnre.gov.in/#/landing ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు.
ఈ విషయాలను మీ దగ్గరలోని రైతులకు తెలియజేయండి .