Pawan Kalyan Sensational comments on Telangana
చిత్రాడలో సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లుగా పార్టీని నడిపానని అన్నారు. 11 ఏళ్ల పార్టీ YCPని 11 సీట్లకు పరిమితం చేసిందని సెటైర్ వేశారు. సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు తననెంతో ప్రభావితం చేశారని కొనియాడుతూ స్టేజీపైనే ఆయనను సత్కరించారు.
రైతు ప్రస్థానం: జనసేనాని స్థాపించడానికి గల ముఖ్య కారణం గద్దర్ ఎందుకంటే ఆయనే నన్ను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారని అన్నారు .ఖుషి సినిమా చూసి గద్దర్ తనను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రోత్సహించారని పవన్ గుర్తు చేసుకున్నారు.జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం AP అని జనసేన జయకేతనం సభలో Dy CM పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘కరెంట్ షాక్ తగిలి చనిపోయే స్థితిలో ఉన్న నన్ను కొండగట్టు అంజన్న దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెనలు పునర్జన్మనిచ్చాయి. అలాంటి నా తెలంగాణ నేల తల్లికి నా హృదయపూర్వక వందనాలు.పాటనే ఆయుధంగా మలచిన వాడు, నన్ను ఎలా ఉన్నావు తమ్ముడూ అని ఆప్యాయంగా పలకరించిన గద్దరన్నను గుర్తుచేసుకుంటున్నా’ అని పేర్కొన్నారు.ఈ సభతో పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలంగాణకు తీసుకు రాబోతున్నాడా అనే ఆలోచన ఫ్యాన్స్లో చోటుచేసుకుంది ఎందుకంటే గత ఎన్నికల్లో తమ పార్టీ తరుపుతాన పోటీ చేస్తాం అని జనసేన అధినేత అన్నారు.