పహల్గాం మారణహోమం తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేట్ | Pahalgam Terror Attack Celebrates Pakistan 25

Pahalgam Terror Attack Celebrates Pakistan

పహల్గామా దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే సంబరాలు చేసుకుంటున్న పాకిస్థాన్ పహల్గాం మారణహోమం తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుందని తెలుస్తోంది.

పహల్గామా దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే సంబరాలు చేసుకుంటున్న పాకిస్థాన్ పహల్గాం మారణహోమం తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుందని తెలుస్తోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఆ దేశ దౌత్యాధికారులు రాక్షసానందం పొందారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ ఉదయం హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు భారీగా చేరుకుని పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.PoKను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్న వీడియో తాజాగా బయటికొచ్చింది. హైకమిషన్కు చెందిన ఓ వ్యక్తి కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్తుండగా మీడియా అతడిని ప్రశ్నించింది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దీంతో పాక్ తీరుపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో ఉంటూ, మనవాళ్లని చంపి సెలబ్రేట్ చేసుకుంటారా? అని మండిపడుతున్నారు.

Leave a Comment