సాధారణ పౌరులకు గుడ్ న్యూస్ ఆర్మిలో చేరే అవకాశం 18 – 42 సంవత్సరాల వారు అర్హులు | Indian Army Recrutment Notification 2025

Indian Army Recrutment Notification 2025

దేశం కోసం పని చేయడం అంటే ఎంతో మందికి ఇష్టం ఉండ్తుంది కానీ కొన్ని కారణాలు మరియు ఏజ్ లిమిట్ కారణంగా వాళ్ళు అది చేయలేక పోతుంటారు కానీ ఇప్పుడు సాధారణ పౌరులకు కూడా దేశం కోసం పని చేయడం కోసం ఇండియన్ ఆర్మీ సువర్ణ అవకాశం కల్పించింది దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..

ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 19 పోస్టులను నియమించనున్నారు. వాటిలో 18 పోస్టులు పురుష అభ్యర్థులకు, 1 పోస్టు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 2025 మే 12 నుంచి జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం సాధారణ పౌరులకు దేశానికి సేవ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.

ముఖ్యమైన తేదీలు

  1. దరఖాస్తు ప్రారంభం: 12 మే 2025
  2. చివరి తేదీ: 10 జూన్ 2025
  3. రాత పరీక్ష తేదీ: 20 జూలై 2025

టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏమిటి?

  • టెరిటోరియల్ ఆర్మీ అనేది 1948లో స్థాపించిన ఒక స్వచ్ఛంద సంస్థ. దీన్ని భారత సైన్యం రెండవ రక్షణ శ్రేణిగా పరిగణిస్తారు. మీరు పౌరుడిగా ఉంటూనే సైన్యంలో ఒకరిగా ఉండవచ్చు. అవసరమైతే మిమ్మల్ని యాక్టివ్ సర్వీస్‌లోకి పిలుస్తారు.
  • ఇది సాధారణ ఉద్యోగం కాదు. కానీ మీ ప్రస్తుత ఉద్యోగం లేదా వ్యాపారంతో పాటు దేశానికి సేవ చేయడానికి ఒక అవకాశం. 1962, 1965, 1971 యుద్ధాలు, 1999 కార్గిల్ యుద్ధంతో సహా అనేక ముఖ్యమైన కార్యకలాపాలలో టెరిటోరియల్ ఆర్మీ పాల్గొంది.

పే స్కేల్, ప్రయోజనాలు

టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పదవికి ఎంపికైన అభ్యర్థులకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు పే స్కేల్ లభిస్తుంది. ఇది వారి ర్యాంక్, సర్వీస్ సమయంలో అనుభవం ప్రకారం నిర్ణయిస్తారు. దీనితో పాటు సేవా కాలంలో రూ. 15,500 సైనిక సేవా వేతనం కూడా అందించబడుతుంది. అభ్యర్థులు రేషన్, ఆర్మీ క్యాంటీన్, వైద్య సౌకర్యాలు, సెలవుల నగదు చెల్లింపు, ప్రభుత్వ వసతి, ప్రయాణ భత్యం వంటి వివిధ సౌకర్యాలను కూడా పొందుతారు. ఇది వారికి గౌరవప్రదమైన, సురక్షితమైన జీవితాన్ని అందిస్తుంది.

  • ఈ నియామకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది కాకుండా అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండటం తప్పనిసరి. ఎంపిక ప్రక్రియలో హాజరు కావడానికి శారీరకంగా, వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యం. ఎందుకంటే సేవకు శారీరక సామర్థ్యం, మానసిక దృఢత్వం అవసరం.
  • ఈ నియామక ప్రక్రియలో పాల్గొనడానికి అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. దరఖాస్తులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. దీని కోసం అభ్యర్థులు www.indianarmy.nic.in లేదా www.jointerritorialarmy.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment