India vs Pakistan War Begins in wagha Border
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొని, ఇరు దేశాలు ఆంక్షలు విధించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అట్టారీ- వాఘా బార్డర్ ద్వారా 188మంది పాకిస్థాన్ ప్రజలు ఆ దేశానికి వెళ్లారు.
రైతు ప్రస్థానం : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొని, ఇరు దేశాలు ఆంక్షలు విధించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అట్టారీ- వాఘా బార్డర్ ద్వారా 188మంది పాకిస్థాన్ ప్రజలు ఆ దేశానికి వెళ్లారు. పాక్లోని 286 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారు. పహల్ గామ్ ఉగ్రదాడి వేళ పాకిస్థాన్ దేశస్థులను భారత్ నుంచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా, ఆపై పాక్ కూడా ఇవే ఆంక్షలను భారతీయులపై విధించింది.పాకిస్థానీలను వెనక్కి పంపాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే ఇండియాను వీడాలని స్పష్టం చేశారు. ఈ నెల 27న వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, HYDలో 200 మంది పాకిస్థానీలు ఉన్నట్లు తెలుస్తోంది.