How to reassign assigned Telangana degrees
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త రెవిన్యూ పోర్టల్ ద్వారా అస్సైన్ భూములకు పట్టాలు వస్తాయి అని ఎంతోమంది రైతులు ఎదురుచొస్స్తున్నారు.ఈ భూముల ద్వారా తమకు హక్కులు వస్తాయని అని వర్గాల రైతులు ఎదురుచూస్తున్నారు.
అస్సలు ఈ అసైన్డ్ భూమి అంటే భూమిలేని పేదలకు వారి జీవనోపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమి. ఈ భూములను విక్రయించడం, బహుమతిగా ఇవ్వడం, తనఖా పెట్టడం, లేదా ఇతరత్రా ఏ రూపంలోనైనా బదిలీ చేయడం సాధారణంగా చట్టరీత్యా నెరాం ఆలా ఎవరైనా చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు . ప్రభుత్వం నిర్దిష్ట నిబంధనలతో ఈ భూములను మంజూరు చేస్తుంది, దాని ద్వారా లబ్ధిదారులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి వ్యవసాయం చేసుకుంటారు. చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూములను విక్రయిస్తే లేదా బదిలీ చేస్తే, ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకునే హక్కును కలిగి ఉంటుంది. అసైన్డ్ భూములకు ఒక రకమైన లావణి పట్టా కూడా జారీ చేస్తారు,
ఇది భూమిలేని పేదలు, మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులు వంటి వారికి ప్రభుత్వం ఇచ్చే మద్దతులో భాగం..ఏ అసైన్డ్ భూమిని బదిలీ చేయకూడదు మరియు ఏ వ్యక్తి కూడా ఏ అసైన్డ్ భూమిని కొనుగోలు, బహుమతి, లీజు, తనఖా, మార్పిడి లేదా ఇతరత్రా ద్వారా పొందకూడదు.1977 అస్సైన్ ల్యాండ్స్ ఆక్ట్ ప్రకారం ఈ భూములు వారసత్వంగా మాత్రమే స్వీకరించాలి తప్ప అమ్మకం ద్వారా ఈ భూములు వచ్చిన లేదా గిఫ్ట్ కింద ఈ భూములు పొందినా కొన్న వారికి మరియు గిఫ్ట్ కింద లేదా తనఖా కిందా ఈ భూమి తీసుకున్న వారికి ఎలాంటి హక్కులు ఉండవు.ఒకవేళ మీకు ఈ భూమి రీ అస్సైన్ చేయాలి అంటే MRO లేదా DD గారికి మాత్రమే అవకాశం ఉంది.
వాళ్ళు మాత్రమే ఈ భూములను బదిలీ లేదా రీ ఆసాయం చేస్తారు.ఒకవేళ మీరు ఈ భూమిని కొనుగోలు చేస్తే ప్రభుత్వం మీ దగ్గర నుండి ఈ భూమిని లాగేసి ప్రభుత్వ భూమి కింద కన్సిడర్ చేస్తుంది.మీరు కాస్తూ పై ఉంన్నా కూడా మీకు ప్రభుత్వం అస్సైన్ చేసిన వాళ్ళ పేరు లిస్ట్ లో మీరు లేకుండా ఉంటె ఆ పేరు ఉన్న వ్యక్తుల వారసత్వానికి ఆ భూమిని తిరిగి అప్పగిస్తుంది.