ఫోర్జరీ పత్రం ఆధారం చేసుకుని భూ తగాదాలో ఆస్తితో సంబంధం లేని వ్యక్తికి అనుకూలంగా ఉత్తర్వులు | Forged Revenue records In Nandyal District 2025

Forged Revenue records In Nandyal District

ఏపీ ఉన్నత న్యాయస్థానంలో తప్పుడు కేసు ఫైలు చేసిన ఆ తహశీల్దారు జైలుకు వెళ్ళక తప్పదా..???

ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తిని బ్లైమ్ చేసిన ఈ ఘనుడు న్యాయ వ్యవస్థనే బ్లాక్ మెయిల్ చేయడం అత్యంత దారుణం…

తప్పు చేశాడని నిరూపించడానికి అవసరమైన సాక్షాలు కోర్టు తీర్పులే ఆధారం…

కేసు నేపథ్యం ఫోర్జరీ పత్రం ఆధారం చేసుకుని భూ తగాదాలో ఆస్తితో సంబంధం లేని వ్యక్తికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిన నేరానికి క్రిమినల్ కేస్ ఫైల్ చేసిన బాధితుడు…

రైతు ప్రస్థానం:  నంద్యాల జిల్లా ఆత్మకూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ : 825/1A లోని ఎకరా 1.16 సెంట్లు భూమిని తెలంగాణ రాష్ట్రానికి చెందిన పింజరి రాజు అనే వ్యక్తి సదరు ఆస్తికి యజమాని కానప్పటికీ ఫోర్జరీ రెవెన్యూ రికార్డులను సృష్టించి వాటిని ఆధారం చేసుకుని యాజమాన్యం చలాయించడంతో అసలు భూమి యజమాని రెవెన్యూ రికార్డులు కాకుండా రిజిస్టర్ పత్రాలను చూపించినప్పటికీ రిజిస్ట్రేషన్ ఆక్టు – 1908 చట్టానికి వ్యతిరేకంగా రెవెన్యూ రికార్డు అయిన 10.(1) అకౌంట్ ఫోర్జరీ పత్రాన్ని ఆధారం చేసుకున్న సదరు తహశీల్దారు తోపాటు మరో ముగ్గురిపై స్థానిక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి గారి ఆదేశాలు మేరకు ప్రైవేట్ కంప్లైంట్ లో భాగంగా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.

అయితే సదరు గౌరవనీయ న్యాయమూర్తి గారు ఫిర్యాదు దారుడు యొక్క ప్రమాణ పత్రాన్ని ఆధారం చేసుకుని కేసు నమోదుకు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా జరిగింది.అయితే మొదట చేసిన నేరం నుండి తప్పించుకోవడంలో భాగంగా ఒక న్యాయవాదిని ఆత్మకూరు కోర్టుకు పంపిన సదరు తహశీల్దారు ప్రమాణ పత్రాన్ని స్థానిక కోర్టు ద్వారా ఉద్దేశపూర్వకంగా తీసుకోకుండానే ప్రమాణ పత్రం లేదన్న తప్పుడు కారణాన్ని చూపించడం ద్వారా మరియు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రమాణం పత్రం లేకుండా సదరు గౌరవ న్యాయమూర్తి గారు కేసు నమోదుకు చట్టవిరుద్ధంగా ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మరియు సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్లు గౌరవ ఏపీ హైకోర్టును తప్పుదారి పట్టించి తప్పుడు కేసు ఫైల్ చేసిన సదరు తహశీల్దారు జైలుకు వెళ్లక తప్పదు.

సెక్షన్ 420 ఇండియన్ పీనల్ కోడ్ -1860 లోని నిర్దేశాలకు విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా అధికారి హోదా ఎంతైనా క్రిమినల్ చర్యలు తప్పవని సుప్రీంకోర్టు తీర్పు చెబుతుంది.భారతదేశ న్యాయస్థానాలను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు న్యాయమూర్తులను బ్లేమ్ చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకుంటే ప్రసక్తి లేదు అటువంటి వారిని జైలుకు పంపేందుకు రంగం సిద్ధం…

Leave a Comment