Farmers 50 subsidy Scheme 2025
రైతులకు 50% సబ్సిడీతో వ్యవసాయ పని మెట్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2.44 కోట్లను కేటాయిన్చనుంది ఆ పథకం ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం
దేశంలో రైతులు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీపైనే ఆధారపడి పని చేస్తున్న విషయం తెలిసిందే ఐతే ఆ టెక్నాలజీని వాడుకొని రైతులకు కూలి కషటం తగ్గించాలి అనే ఉద్దేశంతో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీ తో రైతులకు పనిముట్లు కొనుగోలు చేయడం కోసం డబ్బులను అందించనుంది.అర్హత గల అభ్యర్థులు మర్చి 12,2025 నుండి అప్లై చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
పనిముట్లు ఏంటి
ఈ పథకం కింద అప్లై చేసుకునే అర్హత గల రైతులకు ఈ పని మెట్లు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది.
- దుక్కి ట్రాక్టర్
- పవర్ టిల్లర్లు
- పవర్ వీడర్లు
- బ్యాటరీ
- ఫుట్
- రోటోవేటర్లు
- దమ్ము సెట్లులు
- తైవాన్ స్ప్రేయర్లు
వీటిని రైతులు కొనుగోలు చేయడానికి 50 శాతం సబ్సిడీతో కూడిన రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. రైతులు వీటిని కొనుగోలు చేసి వాటిని తమ వ్యవసాయ పనుల కోసం ఉపయోగించుకోవచ్చు.వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం సుమారు రూ.2.47 కోట్లు మంజూరు చేశారు.
అర్హులు
ఈ పథకానికి అర్హత పొందాలి అంటే ఈ కింద సూచించబడిన అర్హతలను కలిగి ఉండాలి
- పట్టాదారు పాస్ బుక్ కలిగి ఉండి, ఈ పంట నమోదు చేసుకున్న సాగుదారులు. ఆర్ వో ఎఫ్ ఆర్ భూములు సాగు చేస్తున్న వారూ అర్హులే.
- రైతులు ఎవరైతే ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న SC,ST, మహిళలు, సన్న కారు రైతులు.
- గత ఐదేళ్లుగా ఎటువంటి వ్యవసాయ యంత్రాలను పొందని వారు.
- ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం.
ఎలా అప్లై చేయాలి
ప్రభుత్వం అందజేస్తున్న వ్యవసాయ సాగు పరికరాలు కావలసిన రైతులు ఈ నెల అనగా మార్చి 12,2025 నుంచి రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చును. వ్యవసాయ సహాయకుడి లాగిన్ లో రైతులు వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయాధికారి ( అగ్రికల్చర్ ఆఫీసర్ ) యొక్క అప్రూవల్ పొందిన తరువాత వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఆ అప్రూవ్ పొందిన రైతులకు వ్యవసాయ సాగు పరికరాలు మంజూరు చేస్తారు.