Committee Kurrollu OTT: ఈ OTT కమిటీ కుర్రోళ్ళు మూవీ
ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడంతో పాటు, వారి బాల్యాలను తట్టి లేపడంతో పాటు మంచి విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా వినాయక చవితిని పురస్కరించుకుని డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకువచ్చారు.
ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడంతో పాటు, వారి బాల్యాలను తట్టి లేపడంతో పాటు మంచి విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా వినాయక చవితిని పురస్కరించుకుని డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకువచ్చారు.సుమారు పదకొండు మందికి పైగా కొత్త నటులను, నలుగురు హీరోయిన్స్ను వెండితెరకు పరిచయం చేస్తూ నూతన దర్శకుడు యదు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ముఖ్య మైన పాత్రలు పోషించిన వారు సాయికుమార్, గోపరాజు రమణ, సీనియర్ నటి శ్రీ లక్ష్మి, ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్తాన్ని నిర్మించింది.
కథ ఏంటి
గోదావరి జిల్లాల్లోని పురుషోత్తంపల్లి ఓ మారుమూల పల్లెటూరు. అక్కడ పన్నెండేళ్లకు ఒకసారి జరిగే భరింకాళమ్మతల్లి జాతర, అక్కడ చేసే బలి చేట ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈసారి జాతర సమయంలోనే సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జి (సాయి కుమార్)పై పోటీ చేసేందుకు ఆ ఊరికి చెందిన ఓ కుర్రాడున శివ (సందీప్ సరోజ్) ముందుకొస్తాడు. అయితే ో జాతర సమయంలో కులం రిజర్వేషన్ కారణంగా జరిగిన గొడవలో 11 మంది స్నేహితుల్లో ఒకతను ఆత్రం (నరసింహ) మరణిస్తాడు. దాంతో స్నేహితుల్లో కొందరు తలో దారికి వెళ్లిపోతారు. ఆ గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని పంచాయితీలో ఊరి పెద్దలు నిర్ణయిస్తారు.
ఈ క్రమంలో వారంతా ఏం చేశారు, స్నేహితులంతా జాతరలో కలిశారా? కులాలను అడ్డుపెట్టుకుని పన్నెండేళ్ల క్రితం జరిగిన గొడవను ఎప్పటికప్పుడు రగిలిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం పరితపించే ఊరి జనాలు ఎవరు? ప్రస్తుత ప్రెసిడెంట్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్) పాత్ర ఏమిటి? ఈసారి జాతను 11 మంది కమిటీ కుర్రోళ్లు ఎలా చేశారు, ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అన్నది మిగిలిన కథ. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబరు 12 గురువారం (ఈ రోజు) నుంచే ఈ టీవీ విన్ ((Etv win) Ottలో స్ట్రీమింగు వచ్చేసింది. థియేటర్లలో మిస్సయిన వారు, తమ బాల్యాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలనుకునే వారు ఈ మూవీనా ఎట్టి పరిస్థితుల్లో మిస్సవకుండా ఇంటిల్లి పాది కలిసి చూసేయండి.
యాదు వంశీ చక్కటి కథాంశంతో ఎక్కడ కూడా సినిమా అనేది బోర్ కొట్టకుండా ప్రతో ఒక్క నిమిషం సినిమా ఇంట్రస్ట్ గా ఉండేలాగా నిర్మించారు. సెంటిమెంట్ మరియు కామెడీ తో ఫ్యామిలీ అంత కలిసి సినిమా చూసే విధంగా నిర్మించారు. కొత్త డైరెక్టర్ అయిన కొత్త కాన్సెప్ట్ తో ఫ్యామిలీ ఆడియోన్స్ తో పాటు గా మాస్ ఆడియోన్స్ కి నచ్చే విధంగా సినిమా ని చిత్రీకరించారు