1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి | Cm Revanth Reddy talk about 1.50 lakh ekars

Cm Revanth Reddy talk about 1.50 lakh ekars

గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే, వచ్చే మూడేళ్లలో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

లక్ష్మిదేవిపల్లిలో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులతో పాటు అవసరమైన ప్రణాళికలను చేపడుతామని ప్రకటించారు.తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నది నుంచి మంచినీటిని అందించే కార్యక్రమాలను పూర్తి చేస్తామని చెప్పారు. సంవత్సరం తిరిగేలోపు అప్పా జంక్షన్ నుంచి మన్నె గూడ, అక్కడి నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్, అలాగే రేడియల్ రోడ్లను పూర్తి చేస్తామని, రాబోయే రోజుల్లో వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతోందన్నారు.

అనేక సమస్యలను అధిగమిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ప్రజలంతా సహకరించాలని కోరారు. తెలంగాణలో ప్రధానంగా రైతాంగం, నిరుద్యోగ యువత, మహిళలు ప్రాధాన్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెబుతూ ముఖ్యమంత్రి గారు వాటిని వివరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లాలోని 6,650 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి కింద 567.69 కోట్ల రూపాయల చెక్కును మహిళా ప్రతినిధులకు అందజేశారు.

Leave a Comment