Annadaata Sukhibhava Scheme Amount Released
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది వచ్చే వారంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20 వేల రుపాయలను అందించడానికి రంగం సిద్ధం చేసింది.ఈ నెల 20న అందించాల్సి ఉండగా కొన్నీ కారణాల వాళ్ళ అది వాయిదా పడింది.
రైతు ప్రస్థానం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు పెట్టు బడి సహాయం గా అందిస్తున్న 20వేళా రూపాయలను వచ్చే వారం అందించడానికి సన్నాహాలు చేస్తోంది.పీఎం కిసాన్ ద్వారా మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 6 వేల రూపాయలను విడతల వారీగా అందిస్తుంది.సంవత్సరానికి 3 విడతల చొప్పున ఒక విడుతకి 2 వేల చొప్పున రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే .ఐతే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పీఎం కిసన్ ద్వారా అందిస్తున్న 6 వేలకు గాను మరో 14 వేలా రూపాయలను కలిపి మొత్తం 20 వేళా రూపాయలను 3 విడుతల అందించనుంది. ఈ నెల 20న అందించాల్సి ఉండగా పీఎం కిసాన్ పథకం అందిచనున్న 2 వేల రూపాయలను వచ్చే వారం అందించనుందంగా అన్నదాత సుఖీభవ కింద ఇవ్వనున్న 7000 రూపాయలను వచ్చే వారానికి పోస్ట్ ఫోన్ చేసింది.అన్నదాతా సుఖీభవ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తోంది.
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతా సుఖీభవ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. వారిలో 44,30,149 మంది రైతుల ఇకెవైసి పూర్తి కాగా.. 1,20,148 మందికి సంబంధించి ఇకెవైసి పెండింగ్ ఉంది. చివరి సారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మందికి తగ్గినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. గత వైసిపి ప్రభుత్వం లో చేపట్టిన భూ సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు తలె త్తాయి. అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండడంతో అన్నదాతా సుఖీభవకు దరఖాస్తు చేసేందు కు ఆటంకంగా మారింది.
స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి
ఇక, అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ అధికారుల రైతు సేవా కేంద్రాల కు(ఆర్ఎస్కే) పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయ్యింది. వివరాలు లేనివారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకొనే అవకాశం కల్పించారు