Farmers protesting for Urea
మల్లి మొదలైన యూరియా కొరత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్లి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది అని రైతులు వాపోతున్నారు.ఒక్కొక్కరికి 15 బస్తాల చొప్పున ao రాసి కార్డు ఇచ్చిన కూడా ఇంతవరకు మాకు 2 బస్తాలు కూడా ఇవ్వకుండా ఈ రోజు రేపు అంటూ అధికారులు మభ్యపెడుతున్నారని రైతులు వాపోతున్నారు.ఇంకా వివరాల్లోకి వెల్లివెథె8 మహబూబాద్ జిల్లాలో రాత్రి నుండి రైతులు యూరియా బస్తాల కోసం పడి గాపులు కాస్తూ చెప్పులను లైన్లో పెట్టి మరి రాత్రంతా చలికి వణుకుతూ యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నాం అని ఇంత వరకు ఒక్క బస్తా కూడా ఇవ్వకుండా రైతులను అధికారులు మభ్యపెడుతున్నారని రైతులు మహబూబాద్ నుండి తొర్రుర్ వెళ్లే దారిలో బైఠాయించి ఆందోళన చేశారు.అర్ధ రాత్రి వరకు ఆందోళన చేస్తున్న రోడ్ల పై చలిలో పది గాపులు కాస్తున్న కూడా రైతులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళన చేస్తుంటే మా దగ్గరికి ఏవో గారు వచ్చి ఒక్కో రైతుకు 15 బస్తాల చొప్పున రాసారని కానీ ఇంత వరకు ఒక్క బస్తా కూడా యూరియా ఇవ్వలేదని అన్నారు.మేము మొక్క జొన్న పంటను వేసాము ఇంత వరకు మాకు ఒక్క బస్తా కూడా ఇవ్వకపోతే మెం పంటలకు ఎం వేయాలని వాపోయారు.ప్రభుత్వం అందిస్తున్న ఆపిలోనైనా బుక్ చేద్దాం అని అనుకుంటే ఆ ఆప్ ఇంకా మా జిల్లా వరకు రాలేదని దాంట్లో జిల్లా డీలర్స్ దగ్గర యూరియా బస్తాలు లేనట్లు చూపిస్తుంది అన్నారు.








