ఢిల్లీ ఎర్రకోటలో భారీ పేలుడు హై అలర్ట్ | Explosion in Car Near Red Fort in Delhi 2025

Explosion in Car Near Red Fort in Delhi

ఉదయమే భారీ పేలుడు పదార్ధాల స్వాధీనం సాయంత్రమే భారీ నష్టం

రాజధానిలో భారీ పేలుడు పదుల సంఖ్యల్లో క్షత గాత్రులు

పెరుగుతున్న మరణాల సంఖ్యా

రైతు ప్రస్తానం డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంతం 6.55 గంటలకు ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో రైల్ స్టేషన్ గేట్ no.1వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన కారులో పేలుడు సంబంవించింది.ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు.మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది అని సమాచారం.పేలుడులో గాయపడిన క్షగాత్రులను స్థానిక ఎల్ఎన్ఎజేపీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

సోమవారం ఉదయం పేలుడు పదార్ధాలను పట్టుకున్నాక సాయంత్రం 6.55 గంటలకు పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.హరియాణాలోని ఫరీదాబాద్లో ఈ ఉదయం భారీగా పేలుడు సామగ్రి పట్టుబడటం.. సాయంత్రమే దిల్లీలోని ఎర్రకోట సమీపంలోని కారులో భారీ పేలుడు ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

భారీ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.ధ్వంసం ఐన వాహనాలలో ఆరు కార్లు, రెండు ఇ-రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను ఎవరైనా దూరం నుంచి రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. “ఈ పేలుడు జరిగినప్పుడు నేను గురుద్వారా వద్ద ఉన్నాను. భారీ శబ్దం వినిపించింది.

అదేంటో మాకు అర్థంకాలేదు. అంత పెద్దగా వినిపించింది. ఆ వాహనానికి సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలూ పూర్తిగా దగ్ధమయ్యాయి” అని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. దిల్లీ, హరియాణా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసు నిఘాను పెంచారు. రైల్వే స్టేషన్లు, మెట్రోస్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. స్పె సెల్, క్రైం బ్రాంచ్ సహా అన్ని విభాగాలను అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. దిల్లీ-హరియాణా సరిహద్దు సమీపంలో వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేయాలని బృందాలను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింఘు, టిక్రీ, బదర్పుర సరిహద్దుల వద్ద అదనపు పికెట్లను ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేశారు.

Leave a Comment