Truck Sheets Scam in Telangana IKP centers
తెలంగాణాలో 2 వేల కోట్ల వడ్ల స్కాం. వరి ధాన్యం కొనుగోలులో జరిగిన రూ. 2 వేల కోట్లకు పైగా స్కామ్ ఇటీవల బయటపడింది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు,రైస్ మిల్లర్లు ఏకమై ధాన్యం కొనకుండానే కొన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయగా ఈ నకిలీ ట్రక్ షీట్ల దందా బట్టబయలు అయింది.నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు తేలింది.దీంతో ఈ అక్రమాలలో మాజీ ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలులో జరిగిన అతిపెద్ద కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది.ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు మిల్లర్లు ఏకమై వడ్లు కొనకుండానే కొన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి వేల కోట్ల రూపాయలను స్వాహా చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది.దీంతో మొత్తం రూ. 2 వేల కోట్లకు పైగా దందా ఉంటుందని ప్రాథమిక విచారణ అంచనా వేసింది.
దందా
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ దందా రాష్ట్రంలోని పౌర సరఫరాల వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టం చేస్తోంది. మిల్లర్లకు సహకరించిన వారిలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ అధికారులు, సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లు కూడా ఉన్నట్లు తేలింది.వడ్లు కేటాయించినట్లు రికార్డుల్లో చూపించినా కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (CMR) తిరిగి ప్రభుత్వానికి రాకపోవడంతో కొత్త సివిల్ సప్లయ్స్ కమిషనర్ అయినా స్టీఫెన్ రవీంద్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు మొదలవగానే ఈ ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారం బయటపడింది.
ఈ పదేళ్లలో మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం దీని వెనుక ఉన్న నిజమైన కారణం ఇదేనని తనిఖీ చేసిన అధికారులు తెలిపారు.దీంతో తీగ లాగగా డొంక కదిలినట్లు ఈ దోపిడీ అంత వెలుగు చూసింది. ఈ కుంభకోణం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తరించి ఉంది అని అధికారుల అంచనా. హనుమకొండ జిల్లాలో శాయంపేట మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి కమలాపూర్ మండలంలోని సాంబశివ రైస్ మిల్లుకు రూ. 1.70 కోట్ల విలువైన ధాన్యం పంపినట్లు రికార్డులు (ట్రక్ షీట్స్) చూపించారు. కానీ రైస్ మిల్లును తనిఖీ చేయగా అక్కడ వడ్లుగానీ, బియ్యంగానీ ఏమి లేవు. ఫేక్ ట్రక్ షీట్లలో రైతుల పేర్లకు బదులు రైస్ మిల్లు యజమాని కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు ఉండటం ఈ మోసానికి స్పష్టమైన ఆధారం.
ఈ వ్యవహారంలో భాగస్వాములు అయిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి నిధుల రికవరీకి నివేదిక ఇచ్చారు .
మహబూబాబాద్ జిల్లాలో మూడు రైస్ మిల్లులపై దాడులు చేయగా దాదాపు రూ. 24 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు తేలింది.అలాగే నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారులు ఈ తరహా దందా కోసమే రైస్ మిల్లులను ఏర్పాటు చేశారు.ఇక్కడ కూడా రూ. 20 కోట్లకు పైగా కాజేసినట్లు విచారణలో వెల్లడైంది. నిజామాబాద్ జిల్లాలో గతంలో 51 మంది మిల్లర్లు రూ. 270 కోట్ల విలువైన ధాన్యం కేటాయించుకొని సీఎంఆర్ ఇవ్వలేదు. దీనిపై వడ్డీ, పెనాల్టీలు కలిపి మొత్తం రూ. 372 కోట్లుగా నమోదైంది.
మెదక్ జిల్లాలో బాయిల్డ్ రైస్ మిల్లుల నుండి రూ. 13.13 కోట్లు, రా రైస్ మిల్లుల నుంచి రూ. 26.56 కోట్ల విలువైన ధాన్యం రికార్డుల్లో ఉండి.. వాస్తవంగా ఎక్కడా నిల్వ లేకపోవడంపై 24 మిల్లులపై లోతుగా విచారణ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు గుర్తించారు. బోధన్కు చెందిన ఒక మాజీ నాయకుడు రూ. 160 కోట్లు కాజేసినట్లు అధికారులు తేల్చారు.
Follow On:-
- Arattai Channel: Click Here
- Whats app Channel: Click Here
- Telegram Channel: Click Here