మొదటి వారం నుండే రైతుల ఖాతాలో డబ్బు జమ | October 1st week credited Rice crop Money

October 1st week credited Rice crop Money

రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది . ఈ నెలాఖరు నుంచి వరి కోతలు మొదలు కానున్న నేపథ్యంలో.. అక్టోబర్ తోలి వారం నుంచి రైతుల నుండే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు నాలుగు నెలల పాటు కొనసాగనుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రైతుల సౌకర్యం కోసం ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచారు. గత ఖరీఫ్‌ సీజన్ లో 7,139 కేంద్రాలు ఉండగా ఈసారి వాటి సంఖ్యను 8,332కి పెంచడం జరిగింది.రైతులు సన్న ధాన్యం పండించినందుకు గాను 500 బోనస్ ఇవ్వడం వల్ల సాగు విస్తీర్ణం 60.39 లక్షల ఎకరాల నుంచి 65.96 లక్షల ఎకరాలకు పెరిగింది అని అధికారులు వెల్లడించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ వ్యవసాయం, రవాణా, పోలీసులతో సహా ఎనిమిది శాఖలతో సమీక్ష నిర్వహించి కొనుగోళ్ల కార్యాచరణను ఇప్పటికే ఖరారు చేశారు.

పోయిన సంవత్సరం ధాన్యం ఉత్పత్తి 146.28 లక్షల టన్నులుగా ఉండగా ప్రభుత్వం 91.28 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది మాత్రం ఉత్పత్తి అంచనా 159.14 లక్షల టన్నులు ఉన్నప్పటికీ కొనుగోలు లక్ష్యాన్ని మాత్రం 74.99 లక్షల టన్నులకు పరిమితం చేశారు. రైతుల నుంచి వచ్చే ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసేందుకు దొడ్డు, సన్న రకాల ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయం రైతుల కష్టాలకు తగ్గ ఫలితం లభించేలా చూస్తుంది.

రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం నిల్వ, రవాణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకల్లా వాతావరణ అంచనాలను జిల్లాలకు అక్కడి నుంచి కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జులకు, రైతులకు చేరవేయాలని సూచించింది. కేంద్రాల వద్ద ధాన్యం రాశులను తడిచిపోకుండా టార్పాలిన్ కవర్లతో కప్పాలని, తూకం వేసిన సంచులను సైతం కంబైనర్ల వంటి వాటిలో నిల్వ చేసి సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు.

Leave a Comment