Police Case file Againest Vijay Devarakonda
రౌడీ హీరో మరోసారి వార్తలొక్కి ఎక్కారు ఇప్పుడు మరోసారి విజయ్ దేవర కొండా పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటివిల ఆది వాసులను అవమానించేలా మాట్లాడారని హీరో విజయ్ దేవరకొండ పై sc st అట్ట్రాసిటీ కేసు నమోదు.లో ఆదివాసులపై విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై ఈ కేసు నమోదైంది. విజయ్ దేవరకొండపై చర్యలు తీసుకోవాలని ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు అనేక చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రౌడీ హీరో మరోసారి వార్తలొక్కి ఎక్కారు ఇప్పుడు మరోసారి విజయ్ దేవర కొండా పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటివిల ఆది వాసులను అవమానించేలా మాట్లాడారని హీరో విజయ్ దేవరకొండ పై sc st అట్ట్రాసిటీ కేసు నమోదు.లో ఆదివాసులపై విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై ఈ కేసు నమోదైంది. విజయ్ దేవరకొండపై చర్యలు తీసుకోవాలని ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు అనేక చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.త నెల 26న జరిగిన తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడారు.
ఈవెంట్లో పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ‘పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద ఎటాక్ చేస్తారన్నారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే..500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు. విజయ్ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్రాజ్ చౌహాన్ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
ఈ కామెంట్స్ ఆదివాసీల సంస్కృతి, జీవన విధానాన్ని అవమానించేలా ఉన్నాయని వారు ఆరోపించారు.దేంతో విజయ్ దేవరకొండ మరో సారి వార్తల్లో నిలిచారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుంన్నా కింగ్ డమ్ మూవీలో నటిస్తున్నారు.బచ్చన్ మూవీ హీరోయిన్ విజయ్ సరసన నటిస్తున్నారు.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ విజయ్ అభిమానులను ఆకట్టుకుంది.