రేషన్ కార్డు వినియోగదారులకి గుడ్ న్యూస్ | Minister Said Good News to Ration Card Holders 2025

Minister Said Good News to Ration Card Holders

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు వినియోగదారులకి గుడ్ న్యూస్ చెప్పింది రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం అమలు చేస్తాం అని అన్నారు.

రైతు ప్రస్థానం: ఇపుడు ప్రతి ఒక్కరి ఇంట్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యాన్ని సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ప్రతి ఒక్క రేషన్ కార్డు వినియోగ దారులకు రేషన్ కింద సన్న బియ్యాన్ని ఏప్రిల్ ఒకటి నుండి సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.దీనికోసం ప్రత్యేకంగా సభను సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి ఆలయాన్ని సభగా చేసుకునే ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి గారు బియ్యాన్ని పంపిణి చేయనున్నట్లు తెలిపారు.

దీని ద్వారా 2 కోట్లకు పైగా లబ్ధిదారులకు 6 కిలోల సన్న బియ్యం అందుతాయి. ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాలలో సన్న బియ్యం అందించబడుతుంది.రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఈ నెల 30న హుజూర్నగర్లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామన్నారు. అదే రోజు కొత్త రేషన్ కార్డులను విడుదల చేస్తారా లేదా దానికంటూ ఒక రోజు కేటా ఇస్తారా అనేది వేచి చూడాలి.

Leave a Comment