Mahila Samman Savings Scheme details in Telugu
ప్రతి ఒక్కరు ఇప్పుడు రేపటికోసం మనిని సేవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ చాల మంది ఆ మునిని సేవ్ చేసుకోలేకా ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందో తెలియక సమాయంతో పాటుగా డబ్బును కూడా వృధా ప్రయాసగా వదిలేస్తూ ఉంటారు అలంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీంని ప్రవేశ పెట్టింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగుతున్న ఆర్ధిక ఖర్చులు తరుగుతున్న ఆర్ధిక వనరులను మరియు చిన్న చితక వ్యాపారాలు చేసుకుని కాలం వెళ్లదీసే మహిళలు మరియు హౌస్ వైఫ్ గా ఉంటూ దాచుకున్న డబ్బులను ఎక్కడ పెట్టాలో తెలియక మరియు ఆ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ వస్తుంది అనేది వారు తెలుసుకోక వారికి ఎవరు చెప్పక చాలామంది తమ డబ్బును ఇంట్లోనే దాచుకోవడం లేదా అప్పులు ఇచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటారో వారికోసం ప్రత్యేకంగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తుంది అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీం ఈ స్కీం ద్వారా ప్రతి ఒక్క మహిళలను రెండు సంవత్సరాల వ్యవధిలోనే లాక్షాధికారులుగా మార్చనున్నట్లు యూనియన్ బడ్జెట్ సమావేశంలో శ్రీమతి నిర్మల సీతారామన్ తెలిపారు.ఈ పథకం కింద 7.5 నుంచి 7.71% వరకు వడ్డీ రేటును కల్పిస్తుంది కేంద్రం మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి
అర్హులు
- ఈ పథకాన్ని అప్లై చేయాలి అంటే భరత పౌరసత్వం ఉండాలి
- ఈ పథకాన్ని అప్లై చేసే వారు మహిళలలై ఉండాలి.
ఎంత మొత్తం వరకు పెట్టుబడి ఉంటుంది.
- ఈ పథకంలో మహిళలు కనిష్టంగా 1000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.
- గరిష్టంగా 2 లక్షల వరకు పెట్టు బడి పెట్టవోచు.
ఎంత వరకు వడ్డీ ఉంటుంది
ఈ పథకం ద్వారా మహిళలు 7.5 నుంచి 7.71% వరకు వడ్డీని ఆశించవచ్చు.
ఎన్ని సంవత్సరాలకు పెట్టుబడి పెట్టొచ్చు
- ఈ పథకం యొక్క వయసు 2 సంవత్సరాలు
- ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన సంవత్సరం తరువాత 40% వరకు అత్యవసరం కోసం తీసుకోవచ్చు.
- 2 సంవత్సరాలు ముగిసిన తరువాత మీరు కట్టిన అసలు వడ్డీ మొత్తం కలిపి మీ బ్యాక్ ఖాతాలోకి జమ చేయబడుతుంది.
ఎలా అప్లై చేయాలి
ఇక్కడ కనిపిస్తున్న బ్యాంకుల్లోనైనా
- Bank of India
- Bank of Baroda
- Canara Bank
- Union Bank of India
- Punjab National Bank
- Central Bank of India
లేదా మీకు అకౌంట్ ఉన్న బ్యాంకుల్లోనైనా లేదా పోస్ట్ ఆఫీసులో నైనా ఈ పథకానికి అప్లై చేయవచ్చు.